News August 8, 2024
తడి, పొడి చెత్తను వేరు చేసేలా తల్లితండ్రులను ఒప్పించాలి: కలెక్టర్

తడి, పొడి చెత్తను వేరు వేరుగా చెత్తబుట్టల్లో వేసేలా పిల్లలు వారి తల్లి తండ్రులను ఒప్పించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. హుజురాబాద్ పట్టణ కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన స్వచ్ఛదనం, పచ్చదనం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. పిల్లలకు ఈకో క్లబ్, మాస్టర్ ట్రైనర్లతో అవగాహన కల్పించాలని తెలిపారు. ఆగస్టు 15లోగా పిల్లలకు 3 జతల సాక్సుల, ఒక షూ జత అందిస్తామని తెలిపారు.
Similar News
News October 16, 2025
KNR: సానుభూతితో కాదు.. పట్టుదల, ప్రతిభతో విజయం సాధించాలి

కరీంనగర్ జిల్లా కేంద్రంలో మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో బాలికలు సానుభూతితో కాకుండా పట్టుదల, నైపుణ్యంతో విజయం సాధించాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. అంతర్జాతీయ బాలికల దినోత్సవ కార్యక్రమం బుధవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించారు. కష్టపడి చదివితేనే విజయం సాధించవచ్చన్నారు. బాలికలు వివిధ రంగాల్లో నైపుణ్యం సాధించి ధైర్యంగా ముందడుగు వేయాలని కలెక్టర్ కోరారు.
News October 16, 2025
KNR: వ్యాధితో తల్లి.. గుండెపోటుతో తండ్రి దూరం..!

తల్లిదండ్రులు లేని అనాథగా మిగిలాడు చొప్పదండి మండలం రాగంపేటకు చెందిన దీకొండ స్వాద్విన్ కుమార్. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న బాలుడి తల్లి మూడేళ్ల క్రితం ఊపిరితిత్తుల వ్యాధితో మరణించగా తండ్రి ఆదివారం గుండెపోటుతో దూరమయ్యాడు. ఈ క్రమంలో బాలుడి దయనీయ స్థితిని చూసిన రాగంపేట గ్రామస్థులు కంటతడి పెడుతూ.. ప్రభుత్వం, స్వచ్ఛంద సేవా సంస్థలు అతడిని చేరదీసి చదివించాలని కోరుతున్నారు.
News October 16, 2025
KNR: 20 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహించనున్నట్లు కరీంనగర్ సీపీ గౌష్ ఆలం తెలిపారు. రాష్ట్ర DGP ఆదేశాల మేరకు విధి నిర్వహణలో ప్రాణాలను త్యాగం చేసిన పోలీస్ అమరవీరుల సేవలను, త్యాగాలను స్మరించుకుంటూ ఈనెల 20 నుంచి 31 వరకు ‘పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల’ను ఘనంగా నిర్వహించనున్నట్లు సీపీ పేర్కొన్నారు.