News March 30, 2025

తడ్కల్ బాలికకు జాతీయస్థాయిలో 2వ స్థానం

image

కంగ్టి మండలం తడ్కల్ గ్రామానికి చెందిన వాసవి జాతీయ స్థాయిలో ప్రతిభను చాటుకుంది. కామారెడ్డి జిల్లా పిట్లంలో 9వ తరగతి చదువుతున్న వాసవి ఒడిషా రాష్ట్రం భువనేశ్వర్‌లో జరిగిన జూనియర్ రెడ్ క్రాస్(JRC) పోటీల్లో జనరల్ నాలెడ్జ్ రైటింగ్ విభాగంలో దేశవ్యాప్తంగా 2వ స్థానం సాధించింది. ఈ విజయంతో కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు, గ్రామస్థులు అభినందించారు.

Similar News

News December 8, 2025

సాలూరు: విహారయాత్రకు వెళ్లి ఒకరి మృతి

image

సాలూరు (M) దళాయివలస జలపాతం వద్ద ఆదివారం ఒకరు మృతి చెందారు. రామభద్రపురానికి చెందిన హరి స్నేహితులతో కలిసి విహారయాత్రకు జలపాతానికి వెళ్లాడు. జలపాతం దిగువ ప్రాంతంలో ఈతకు వెళ్లి ఊబిలో కురుకుపోవడంతో స్థానికుల సహకరంతో హరిని బయటకు తీసి సాలూరు ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News December 8, 2025

ఉడిత్యాలలో..11.4 డిగ్రీల అత్యంత ఉష్ణోగ్రత

image

మహబూబ్ నగర్ జిల్లాలో గడచిన 24 గంటల్లో చలి తీవ్రత గణనీయంగా పెరిగింది. బాలానగర్ మండలంలోని ఉడిత్యాలలో 11.4 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయింది. రాజాపూర్ 11.7, గండీడ్ మండలం సల్కర్ పేట 11.8, మిడ్జిల్ మండలం, దోనూరు 12.2, కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్ 12.6, భూత్పూర్ 13.0, మిడ్జిల్ మండలం కొత్తపల్లి 13.3, మహమ్మదాబాద్, కోయిలకొండ మండలం పారుపల్లి 13.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.

News December 8, 2025

ఆత్మకూరు: బైకు అదుపు తప్పి యువకుడి మృతి

image

రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. స్థానికుల వివరాలు.. ఆత్మకూరుకు చెందిన నవీన్ (36) బంధువుల వద్దకు అమరచింత బంధువుల వద్దకు వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఆత్మకూరు సమీపంలో బైక్ అదుపుతప్పి ఎడమవైపు ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో నవీన్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది వచ్చి మరణాన్ని నిర్ధారించారు. మృతుడికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు.