News March 30, 2025
తడ్కల్ బాలికకు జాతీయస్థాయిలో 2వ స్థానం

కంగ్టి మండలం తడ్కల్ గ్రామానికి చెందిన వాసవి జాతీయ స్థాయిలో ప్రతిభను చాటుకుంది. కామారెడ్డి జిల్లా పిట్లంలో 9వ తరగతి చదువుతున్న వాసవి ఒడిషా రాష్ట్రం భువనేశ్వర్లో జరిగిన జూనియర్ రెడ్ క్రాస్(JRC) పోటీల్లో జనరల్ నాలెడ్జ్ రైటింగ్ విభాగంలో దేశవ్యాప్తంగా 2వ స్థానం సాధించింది. ఈ విజయంతో కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు, గ్రామస్థులు అభినందించారు.
Similar News
News October 28, 2025
చిత్తూరు: విద్యుత్ ఉద్యోగులకు సెలవులు లేవు

మొంథా తుఫాన్ కారణంగా చిత్తూరు డివిజన్ లో విద్యుత్ అధికారులు, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని ఈఈ మునిచంద్ర సిబ్బందిని అదేశించారు. మరో రెండు రోజుల పాటు సెలవులు ఎవరికీ ఇవ్వడం జరగదని, సెలవుల్లో ఉన్నవారు కూడా విధులకు హాజరవ్వాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలన్నారు.
News October 28, 2025
హెయిర్ డై వాడే ముందు ఇవి తెలుసుకోండి

జుట్టుకు రంగువేసుకోవడం వల్ల హార్మోన్ల అసమతౌల్యత, క్యాన్సర్ రావొచ్చని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. తప్పనిసరైతే తప్ప డై వాడకూడదంటున్నారు నిపుణులు. వీటిలో ఉండే అమోనియా, PPD, హైడ్రోజన్ పెరాక్సైడ్ తలలోని నేచురల్ ఆయిల్స్ని పొడిబారేలా చేస్తాయి. దీంతో జుట్టు రాలడం, పొడిబారడం, చిట్లడం వంటి సమస్యలు వస్తాయి. అలాగే సెన్సిటివ్ స్కిన్ ఉంటే దురద, అలెర్జీ, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు వస్తాయంటున్నారు.
News October 28, 2025
తుఫాను షెల్టర్లకు 534 మంది: మంత్రి నాదెండ్ల

ఏలూరు జిల్లాలో తుఫాను సహాయక చర్యలు ముమ్మరం చేశారు. జిల్లాలోని 27 సహాయక కేంద్రాలకు 534 మంది ప్రజలను తరలించామని ఇన్ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. మొంథా తుఫానును ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. కలెక్టరేట్లో సోమవారం రాత్రి ఆయన మాట్లాడారు. 408 గ్రామ/వార్డు సచివాలయాల సిబ్బంది వాస్తవ పరిస్థితులు తెలియజేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.


