News May 12, 2024
తడ: ప్రత్యేక పడవలపై బయలుదేరిన పోలింగ్ సిబ్బంది

తడ మండలం ఇరకం దీవిలో నివసిస్తున్న ఓటర్ల కోసం ఆదివారం రెండు ప్రత్యేక పడవల్లో పోలింగ్ సిబ్బంది, అధికారులు ఈవీఎం పరికరాలతో బయలుదేరి వెళ్లారు. ఇరకం దీవిలోని రెండు పోలింగ్ కేంద్రాలలో 1148 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ రెండు పోలింగ్ కేంద్రాలకుగాను 30 మంది ఎన్నికల అధికారులు, సిబ్బంది బయల్దేరి వెళ్లారు.
Similar News
News October 27, 2025
మొంథా ఎఫెక్ట్.. నెల్లూరుకు రూ.కోటి నిధులు

మొంథా తుపాన్ను ఎదుర్కునేందుకు నెల్లూరు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. జిల్లాలో సహాయక చర్యలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.కోటి నిధులు విడుదల చేసింది. తుపాను ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.
News October 27, 2025
నెల్లూరు జిల్లాకు రెడ్ అలెర్ట్

నెల్లూరు జిల్లాలో చెదురు మొదరు చినుకులుగా ప్రారంభమై భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో IMD రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా వచ్చే రెండు రోజుల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ‘గంటకు 45–55 కి.మీ వేగంతో వీచే గాలులు, కొన్ని చోట్ల 65 కి.మీ వరకు వేగం చేరే అవకాశం ఉంది. కోస్తాంధ్ర, యానం, రాయలసీమ ప్రాంతాల్లో పలు చోట్ల గాలివానలు సంభవించవచ్చు’ అని పేర్కొంది.
News October 27, 2025
నెల్లూరు: డివిజన్లవారీగా కంట్రోల్ రూమ్ నెంబర్లు ఇవే.!

బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను నేపథ్యంలో జిల్లా కలెక్టరు కార్యాలయంతోపాటు అన్ని రెవెన్యూ డివిజన్ల వారీగా కంట్రోల్ రూమ్లను అధికారులు ఏర్పాటు చేశారు.
*జిల్లా కలెక్టరేట్ కంట్రోలు రూం నెంబర్లు: 0861 2331261, 7995576699
*కందుకూరు సబ్ కలెక్టర్ కార్యాలయం, : 7601002776
*ఆర్డీవో కార్యాలయం, నెల్లూరు : 9849904061
*ఆర్డీవో కార్యాలయం, ఆత్మకూరు : 9100948215
*ఆర్డీవో కార్యాలయం, కావలి : 7702267559.


