News February 12, 2025

తడ:  శ్రీసిటీ జీరో పాయింట్ వద్ద రోడ్డు ప్రమాదం

image

తడ మండలం శ్రీసిటీ జీరో పాయింట్ వద్ద మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్కూటీలో వస్తున్న వ్యక్తి వేగంగా ఆగి ఉన్న లారీని వెనుక వైపు నుంచి ఢీకొట్టడంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు చెప్పారు. 108 ద్వారా స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Similar News

News March 26, 2025

పోలీసుల అదుపులో తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి!

image

రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిని సోమందేపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. <<15892859>>రామగిరి<<>> ఎంపీడీవో కార్యాలయం వద్ద టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో వైసీపీ శ్రేణులకు మద్దతుగా వెళ్తున్న ఆయనను జాతీయ రహదారిపై డీఎస్పీ వెంకటేశ్వర్లు అదుపులోకి తీసుకున్నారు. మీరు అక్కడికి వెళ్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని పోలీసులు ఆయనకు చెప్పారు. 

News March 26, 2025

బెట్టింగ్ యాప్స్‌ వ్యవహారంపై సిట్: సీఎం రేవంత్

image

TG: బెట్టింగ్ యాప్స్ వివాదంపై సీఎం రేవంత్ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. ఈ వ్యవహారంపై సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న టాలీవుడ్ సెలబ్రిటీలు, యూట్యూబర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్లపై పోలీసులు కేసు నమోదు చేస్తున్న విషయం తెలిసిందే. పలువురిని విచారణకు కూడా పిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం ప్రకటన చర్చనీయాంశంగా మారింది.

News March 26, 2025

తిరుమల: టీటీడీ ట్రస్టులకు భారీగా పెరిగిన విరాళాలు

image

గడిచిన 9 రోజుల్లో వివిధ ట్రస్ట్‌లకు విరాళంగా రూ. 26.85 కోట్లు అందినట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ‘X’ వేదికగా తెలిపారు. అత్యధికంగా శ్రీవారి ఆలయ నిర్మాణ ట్రస్ట్‌కు రూ.11.67 కోట్లు, ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్‌కు రూ.6.14 కోట్లు, శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని స్కీమ్‌కు రూ.4.88 కోట్లు అందినట్లు చెప్పారు. తాజాగా టీటీడీ విద్యాదాన ట్రస్ట్‌కు రూ 1.01 కోట్లు విరాళం అందినట్లు చెప్పారు.

error: Content is protected !!