News January 31, 2025
తణుకు: రాత్రంతా నిద్ర పోకుండా..!

తణుకు రూరల్ ఎస్ఐ ఏజీఎస్ మూర్తి ఆత్మహత్య కేసులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. సీఎం చంద్రబాబు ఇవాళ పెనుగొండకు రానున్నారు. ఈ పర్యటనలో మూర్తి బందోబస్తు విధులు నిర్వహించాల్సి ఉంది. ఏదో విషయమై మదనపడుతూ నిన్న రాత్రంతా ఆయన నిద్రపోకుండా కుటుంబ సభ్యులతో గడిపారని తెలుస్తోంది. ఉదయాన్నే పెనుగొండకు వెళ్లాల్సిన ఎస్ఐ తణుకు స్టేషన్ దగ్గరకు వచ్చి తనతో తెచ్చుకున్న తుపాకీతో కాల్చుకున్నారు.
Similar News
News November 18, 2025
నో ఛేంజ్.. SRH కెప్టెన్ కమిన్సే

SRHకు కొత్త కెప్టెన్ను నియమిస్తారనే ప్రచారానికి యాజమాన్యం ఫుల్స్టాప్ పెట్టింది. వచ్చే IPL సీజన్లోనూ పాట్ కమిన్సే కెప్టెన్గా ఉంటారంటూ SMలో ఓ పోస్టర్ను షేర్ చేసింది. అతని సారథ్యంలో 2024లో ఫైనల్ చేరిన SRH.. 2025లో ఆరోస్థానంలో నిలిచింది. ఓవరాల్గా కమిన్స్ కెప్టెన్సీలో 30 మ్యాచ్లు ఆడగా 15 గెలిచి, 14 ఓడింది. ఓ మ్యాచ్లో ఫలితం తేలలేదు. అతడిని వేలంలో రూ.20.50 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
News November 18, 2025
నో ఛేంజ్.. SRH కెప్టెన్ కమిన్సే

SRHకు కొత్త కెప్టెన్ను నియమిస్తారనే ప్రచారానికి యాజమాన్యం ఫుల్స్టాప్ పెట్టింది. వచ్చే IPL సీజన్లోనూ పాట్ కమిన్సే కెప్టెన్గా ఉంటారంటూ SMలో ఓ పోస్టర్ను షేర్ చేసింది. అతని సారథ్యంలో 2024లో ఫైనల్ చేరిన SRH.. 2025లో ఆరోస్థానంలో నిలిచింది. ఓవరాల్గా కమిన్స్ కెప్టెన్సీలో 30 మ్యాచ్లు ఆడగా 15 గెలిచి, 14 ఓడింది. ఓ మ్యాచ్లో ఫలితం తేలలేదు. అతడిని వేలంలో రూ.20.50 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
News November 18, 2025
గండికోటలో ప్రమాదాల అంచున సెల్ఫీ

గండికోట ప్రసిద్ధి చెందిన పర్యాటక కేంద్రం. యువకులు, విద్యార్థులు, పెద్దలు, కొందరు పర్యాటకులు గండికోటను దర్శిస్తుంటారు. ఇక్కడ లోయ ఉండడంతో ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తుంటుంది. రెండు కొండల మధ్య లోయ చుపరులను ఆకట్టుకుంటూ కనువిందు చేస్తుంటుంది. ఈ దృశ్యాన్ని తిలకిస్తూ ప్రమాదపు అంచున ఫొటోలు దిగుతూ ఉంటారు. అధికారులు ప్రమాదాలు జరగకుండా ముందస్తుగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని పలువురు పేర్కొంటున్నారు.


