News February 3, 2025

తణుకు: వైరల్ అవుతున్న ఎస్సై మూర్తి సంభాషణ

image

తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఎస్సై మూర్తి వ్యవహారంలో ఆత్మహ్యతకు గల వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. గేదెల అపహరణ కేసులో జిల్లా వీఆర్‌కు పంపిన ఉన్నతాధికారులు తాజాగా రేంజ్ వీఆర్‌కు పంపడంతో తీవ్ర మనస్థాపానికి గురవడంతో ఎస్సై ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది. ఉన్నతాధికారులు తనపై కక్ష సాధింపు చేస్తున్నారని తాను చనిపోతానని స్నేహితుడితో సంభాషించిన మాటలు ఇప్పుడు ఓ ఆడియో వైరల్ అవుతుంది.

Similar News

News November 18, 2025

VKB: ‘డ్రగ్స్ బారిన పడి జీవితాలను నాశనం చేసుకోవద్దు’

image

యువత డ్రగ్స్ మహమ్మారిన పడి నిండు జీవితాలను నాశనం చేసుకోవద్దని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి స్వర్ణ కుమారి తెలిపారు. మంగళవారం వికారాబాద్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా విద్యార్థి దశలో డ్రగ్స్‌కు అలవాటు పడితే పూర్తిగా జీవితం చిన్న భిన్నం అవుతుందని, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని తెలిపారు.

News November 18, 2025

ఆన్లైన్ మోసాలపై తస్మాత్ జాగ్రత్త: ప్రకాశం SP

image

ఆన్‌లైన్ మోసాలపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా SP హర్షవర్ధన్ రాజు సూచించారు. మంగళవారం ఒంగోలు SP కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఇటీవల కాలంలో ఆన్‌లైన్ మోసాలు పెరుగుతున్నాయని అన్నారు. ఫ్రాడ్ కాల్ స్కామ్ల ద్వారా సైబర్ మోసగాళ్ళు అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుంటున్నారని హెచ్చరించారు. ఇలాంటి మోసాలపై హెల్ప్ లైన్ నంబర్ 1930కు సమాచారం ఇవ్వాలని చెప్పారు.

News November 18, 2025

రేపు అకౌంట్లలోకి రూ.7,000.. ఇలా చేయండి

image

AP: రాష్ట్ర ప్రభుత్వం రేపు రైతుల అకౌంట్లలో రూ.7వేలు జమచేయనుంది. కడప జిల్లాలోని పెండ్లిమర్రిలో జరిగే కార్యక్రమంలో పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ నిధులను సీఎం చంద్రబాబు విడుదల చేయనున్నారు. అనంతరం రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. కాగా రైతులు ఆన్‌లైన్‌లో <>annadathasukhibhava.ap.gov.in<<>> ద్వారా తమ అర్హతను తెలుసుకోవచ్చు. పోర్టల్‌కి వెళ్లి Know Your Statusలో వివరాలను ఎంటర్ చేస్తే ఎలిజిబుల్/కాదో తెలుస్తుంది.