News February 13, 2026

తపోవనం పీఠాధిపతి గుండెపోటుతో మృతి

image

తుని మండలం కుమ్మరిలోవ తపోవనం ఆశ్రమ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద సరస్వతి మహాస్వామీజీ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందారు. గుండెనొప్పితో తుని ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. స్వామీజీ మరణవార్తతో భక్తులు, శిష్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆశ్రమంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆధ్యాత్మిక రంగంలో ఆయన చేసిన సేవలను స్థానికులు స్మరించుకుంటున్నారు.

Similar News

News March 9, 2026

కన్నీళ్లు ఆపుకొని కీలక ఇన్నింగ్స్ ఆడిన ఇషాన్

image

T20WC ఫైనల్‌లో ఆడటం క్రికెటర్ల కల. అలాంటిది ఒక్కరోజు ముందే కుటుంబ సభ్యులను కోల్పోతే వచ్చే దుఃఖం వర్ణనాతీతం. అలాంటి విషాద ఘటన కిషన్ ఇంట నెలకొంది. 7వ తేదీ కారు ప్రమాదంలో అతని కజిన్ సిస్టర్ వైష్ణవి, బావ చనిపోయారు. అయినా కన్నీళ్లు ఆపుకొని కిషన్ నిన్న 54 రన్స్ చేశారు. మ్యాచ్ ఆమె కోసమే ఆడానని, గెలుపు సోదరికి అంకితమన్నారు. బాధను హార్దిక్‌‌తో పంచుకోగా ఈ టైమ్‌లో దేశమే ముఖ్యమని స్ఫూర్తి నింపినట్లు చెప్పారు.

News March 9, 2026

సంగారెడ్డి: అక్టోబర్‌లో 101 ఏళ్ల బర్త్ డే.. మృతి

image

సంగారెడ్డి జిల్లా కంగ్టికి చెందిన శతాధిక వృద్ధురాలు గాదె పారమ్మ (101) ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గత ఏడాది అక్టోబర్‌లో ఆమె కుమారులు, మనమలు, ముని మనమలు కలిసి ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. సుదీర్ఘ జీవిత ప్రయాణాన్ని ముగించి ఆమె మరణించడంతో గ్రామంలో విషాదం నెలకొంది. కంగ్టి సర్పంచ్ కృష్ణ, ముదిరాజ్ సంఘం నాయకులు ఆమె మృతికి సంతాపం తెలిపారు.

News March 9, 2026

కరీంనగర్: ఈనెల 12 వరకే ఛాన్స్..!

image

క్రీడల్లో రాణించాలనుకునే విద్యార్థులకు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ అద్భుత అవకాశం కల్పించింది. 2026-27 విద్యా సంవత్సరానికి గాను క్రీడా పాఠశాలల్లో 4వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. కరీంనగర్ పాఠశాలలో మొత్తం 40 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఆన్‌లైన్ దరఖాస్తులకు ఈనెల 12వ వరకు మాత్రమే గడువు ఉందని అధికారులు తెలిపారు. 01-09-2017 నుంచి 31-08-2018 మధ్య జన్మించిన వారు ఈ ప్రవేశాలకు అర్హులు.