News June 28, 2024

తప్పిపోయిన యువకుడి ఆచూకీ కోసం చర్యలు తీసుకోవాలి: MLC

image

జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన మల్లేష్ వారం క్రితం ఓమాన్-యూఏఈ (మస్కట్-దుబాయి)దేశాల సరిహద్దులో తప్పిపోయాడని అతని కుటుంబ సభ్యులు MLC జీవన్ రెడ్డిని శుక్రవారం కలిసి సహాయాన్ని కోరారు. ఈ మేరకు స్పందించిన MLC మస్కట్, దుబాయిలలోని భారత రాయబారులు, కేంద్ర విదేశాంగ మంత్రి, ముఖ్యమంత్రి కార్యాలయానికి, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీకి ‘X’ ద్వారా ట్వీట్ చేసి చర్యలు తీసుకోవాలని కోరారు.

Similar News

News September 20, 2024

జగిత్యాల: వరి ధాన్యం కొనుగోలుపై కలెక్టర్ సమీక్ష

image

రాబోయే ఖరీఫ్ 2024-25 వరిధాన్యం కొనుగోలుకు సంభందించి వివిధ శాఖల అధికారులతో గురువారం జగిత్యాల కలెక్టరేట్‌లో కలెక్టర్ సత్యప్రసాద్ సమీక్ష నిర్వహించారు. మద్దతు ధర క్వింటాకు గ్రేడ్ ఏ రకానికి రూ.2,320, కామన్ రకానికి రూ.2,300 ధర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. కొనుగోలు కేంద్రాల్లో సరిపడా ప్యాడి క్లీనింగ్ మిషన్స్, టార్పాలిన్ కవర్లు అందుబాటులో ఉంచాలన్నారు. టోకెన్ పద్ధతి పాటించాలని సూచించారు.

News September 19, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ జగిత్యాల ప్రభుత్వ వైద్య కళాశాలను తనిఖీ చేసిన కలెక్టర్ సత్య ప్రసాద్.
@ మల్లాపూర్ మండలంలో విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి.
@ పెద్దపల్లి జిల్లాలో వ్యక్తి దారుణ హత్య.
@ మల్లాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి.
@ వరి ధాన్యం కొనుగోలుపై జగిత్యాల కలెక్టర్ సమీక్ష.

News September 19, 2024

డీజీపీని కలిసిన బీఆర్ఎస్ MLAలు

image

తెలంగాణలో బీఆర్ఎస్ నాయకులపై వరుస దాడులు, స్థానిక పోలీసుల వైఫల్యం వంటి విషయాలపై రాష్ట్ర డీజీపీ జితేందర్‌ను HYDలో కలిసి దాడులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. డీజీపీని కలిసిన వారిలో కోరుట్ల MLA డా.కల్వకుంట్ల సంజయ్, హుజురాబాద్ MLA పాడి కౌశిక్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తదితరులున్నారు.