News March 3, 2025
తప్పుడు పత్రాల రిజిస్ట్రేషన్ల ముఠాపై కేసు నమోదు

తప్పుడు రిజిస్ట్రేషన్లు, డబుల్ రిజిస్ట్రేషన్ ద్వారా రుణాలు ఇప్పిస్తామంటూ నమ్మించి మోసం చేస్తున్న ముఠాపై కేసు నమోదు చేసినట్లు ఖానాపురం హవేలీ ఇన్స్పెక్టర్ భానుప్రకాశ్ తెలిపారు. మధుర నగర్కి చెందిన షేక్ బడే సాహెబ్, చింతకాని మండలం పాతర్లపాడుకు చెందిన కొత్తపల్లి వేంకటేశ్వర్లు, తిప్పర్తి అశోక్ కుమార్ (RI)పై కేసు నమోదు చేసి తప్పుడు పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
Similar News
News December 4, 2025
వాస్తును నమ్మవచ్చా?

వాస్తుపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. కొందరు దీన్ని నిజమని నమ్ముతారు. మరికొందరు మూఢనమ్మకమని అభిప్రాయపడతారు. అయితే వాస్తు అనేది ఓ శాస్త్రమని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు చెబుతున్నారు. ‘ఇది కేవలం ఓ నమ్మకం కాదు. జీవన మనుగడకు అవసరమైన పంచభూతాలను ఈ శాస్త్రం సమన్వయం చేస్తుంది. నివాసయోగ్యత కోసం మనం నివసించే ప్రదేశాలలో ఈ పంచభూతాల సమతుల్యత కోసం వాస్తును పాటించాలి’ అని అంటున్నారు. <<-se>>#Vasthu<<>>
News December 4, 2025
భద్రాద్రి: ‘ఎన్నికల సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ తప్పనిసరి’

పంచాయతీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్క ఎన్నికల సిబ్బందికి తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కల్పించాలని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. పంచాయతీ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని నిర్వహించిన వీసీలో కలెక్టర్, ఎన్నికల సాధారణ పరిశీలకులు సర్వేశ్వర్ రెడ్డి, వ్యయ పరిశీలకులు లావణ్య, అదనపు కలెక్టర్ విద్యచందన, జడ్పీ సీఈవో నాగలక్ష్మి పాల్గొన్నారు.
News December 4, 2025
హార్టికల్చర్ హబ్కి కేంద్రం ₹40వేల కోట్లు: CBN

AP: హార్టికల్చర్ హబ్గా 9 జిల్లాలను తయారుచేస్తున్నామని CM CBN తెలిపారు. దీనికోసం కేంద్రం పూర్వోదయ స్కీమ్ కింద ₹40వేల కోట్లు ఇస్తోందని చెప్పారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని పెట్టుబడుల్ని ఆకర్షించాలని చెప్పారు. అధికారులు టెక్నాలజీపై గ్రిప్ పెంచుకోవాలన్నారు. 7వ తరగతి నుంచే AI బేసిక్స్పై బోధన ఉండాలని సూచించారు. విశాఖ కాపులుప్పాడలో హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్ల కోసం 50 ఎకరాలు కేటాయించాలని చెప్పారు.


