News March 3, 2025

తప్పుడు పత్రాల రిజిస్ట్రేషన్ల ముఠాపై కేసు నమోదు

image

తప్పుడు రిజిస్ట్రేషన్లు, డబుల్ రిజిస్ట్రేషన్ ద్వారా రుణాలు ఇప్పిస్తామంటూ నమ్మించి మోసం చేస్తున్న ముఠాపై కేసు నమోదు చేసినట్లు ఖానాపురం హవేలీ ఇన్స్‌పెక్టర్ భానుప్రకాశ్ తెలిపారు. మధుర నగర్‌కి చెందిన షేక్ బడే సాహెబ్, చింతకాని మండలం పాతర్లపాడుకు చెందిన కొత్తపల్లి వేంకటేశ్వర్లు, తిప్పర్తి అశోక్ కుమార్ (RI)పై కేసు నమోదు చేసి తప్పుడు పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

Similar News

News March 19, 2025

నాగర్‌కర్నూల్ జిల్లాకు ఎల్లో WARNING

image

నాగర్‌కర్నూల్ జిల్లాకు హైదరాబాద్ వాతావరణ శాఖ మంగళవారం ఎల్లో వార్నింగ్ జారీ చేసింది. మంగళవారం జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో 36 నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతను నమోదయ్యాయని వాతావరణ శాఖ నివేదిక పేర్కొంది. రాబోయే రెండు, మూడు రోజుల వరకు జిల్లాలో సుమారు 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

News March 19, 2025

MBNR: GREAT.. ఓపెన్‌లో GOVT జాబ్ కొట్టాడు..!

image

TGPSC నిర్వహించిన జూనియర్ లెక్చరర్ పరీక్షలో పాలమూరు విశ్వవిద్యాలయం పరిధి గద్వాలలోని పీజీ సెంటర్‌లో 2017-2019లో MA తెలుగు పూర్తి చేసిన S.రాకేశ్ రాష్ట్ర స్థాయిలో తన ప్రతిభను చాటి ఓపెన్‌లో ఉద్యోగం సాధించారు. దీంతో యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్(VC), ప్రొఫెసర్ G.N.శ్రీనివాస్ రాకేశ్‌ను ఘనంగా సన్మానించి అభినందించారు. రిజిస్ట్రార్ చెన్నప్ప, తెలుగు శాఖ అధ్యక్షురాలు డా.సంధ్యారాణి పాల్గొన్నారు.

News March 19, 2025

VKB: CMకు ‘THANK YOU’ చెప్పిన ఎమ్మెల్యేలు

image

రాష్ట్రంలోని SC, ST, BC, మైనారిటీ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలను పెంచేందుకు రూ.6000 వేల కోట్లతో రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించినందున సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌‌కు తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. EWSలకు రూ.1000 కోట్లు కేటాయించాలని వినతిపత్రం అందజేశారు. ఆయా నియోజకవర్గాల MLAలు పాల్గొన్నారు.

error: Content is protected !!