News April 28, 2024
తర్లుపాడు: గుంటలో పడి వ్యక్తి మృతి

తర్లుపాడు నుంచి మార్కాపురం వెళ్లే ప్రధాన రహదారిలోని సీతానాగులవరం గ్రామం సమీపంలో ఆదివారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనదారుడు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న గుంటలోపడి చనిపోయాడని స్థానికులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న తర్లుపాడు ఎస్సై వేముల సుధాకర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ ప్రమాదం గురించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Similar News
News October 28, 2025
ప్రకాశం: జాతీయ రహదారులపై రాకపోకలు నిషేధం

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లాలోని జాతీయ రహదారుల్లో భారీ వాహనాల రాకపోకలను రాత్రి 7 గంటల నుంచి నిలిపివేస్తున్నట్లు SP హర్షవర్ధన్ రాజు ప్రకటన విడుదల చేశారు. అలాగే జాతీయ, రాష్ట్ర రహదారుల్లో వాహనాల ప్రయాణం నిషేధించడం జరిగిందని, ప్రజా రక్షణ నిమిత్తం తీసుకున్న నిర్ణయాన్ని వాహనదారులు పాటించాలని ఎస్పీ సూచించారు.
News October 27, 2025
తుఫాన్ ఎఫెక్ట్.. ప్రకాశం వాసులకు కలెక్టర్ సూచన.!

తుఫాన్ ప్రభావంతో ప్రకాశం జిల్లా వాసులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు.
➤అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దు.
➤అనవసర ప్రయాణాలు మానాలి.
➤పిల్లలను వాగుల వద్దకు వెళ్లకుండా చూడాలి.
➤ప్రమాదకర స్థాయిలో వాగులను దాటరాదు.
➤ఈత సరదా కోసం నీటిలో దిగరాదన్నారు.
➤శిధిలావస్థలో ఉన్న భవనాల్లో నివసించరాదన్నారు.
➤2 రోజులకు అవసరమైన ఆహార పదార్థాలు సమకూర్చాలన్నారు.
➤అత్యవసరసాయానికి 108,104,102కు కాల్ చేయాలన్నారు.
News October 27, 2025
ప్రకాశం అధికారులను అలర్ట్ చేసిన సీఎం

మొంథా తుఫాన్ నేపథ్యంలో సచివాలయం నుంచి సీఎం చంద్రబాబు నాయుడు అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహిస్తున్న వీడియో కాన్ఫరెన్స్లో ఒంగోలు కలెక్టరేట్ నుంచి పాల్గొన్న జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా తుఫాన్ ప్రభావం గురించి, రెవెన్యూ సిబ్బంది తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు. సమావేశంలో జేసీ గోపాలకృష్ణ , ఎస్పీ హర్షవర్ధన్ రాజు పాల్గొన్నారు.


