News April 28, 2024
తర్లుపాడు: గుంటలో పడి వ్యక్తి మృతి

తర్లుపాడు నుంచి మార్కాపురం వెళ్లే ప్రధాన రహదారిలోని సీతానాగులవరం గ్రామం సమీపంలో ఆదివారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనదారుడు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న గుంటలోపడి చనిపోయాడని స్థానికులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న తర్లుపాడు ఎస్సై వేముల సుధాకర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ ప్రమాదం గురించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Similar News
News November 22, 2025
ప్రకాశంపై పవన్ గురి.. స్పీడ్ పెరగనుందా?

ప్రకాశంలో జనసేన కమిటీల ఏర్పాటుపై పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టి సారించారు. ఇప్పటికే జిల్లాకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తల మనోభావాలను తెలుసుకున్న పవన్.. పార్టీ బలోపేతానికి తీసుకోవలసిన చర్యలపై క్యాడర్ను అప్రమత్తం చేశారట. త్వరలోనే పార్టీ కమిటీల నిర్మాణం గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు సాగనుందన్న ప్రచారం నేపథ్యంలో, మరి ఇందులో ఎవరెవరికి చోటు దక్కుతుందో వేచిచూడాలి.
News November 22, 2025
ప్రకాశంపై పవన్ గురి.. స్పీడ్ పెరగనుందా?

ప్రకాశంలో జనసేన కమిటీల ఏర్పాటుపై పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టి సారించారు. ఇప్పటికే జిల్లాకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తల మనోభావాలను తెలుసుకున్న పవన్.. పార్టీ బలోపేతానికి తీసుకోవలసిన చర్యలపై క్యాడర్ను అప్రమత్తం చేశారట. త్వరలోనే పార్టీ కమిటీల నిర్మాణం గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు సాగనుందన్న ప్రచారం నేపథ్యంలో, మరి ఇందులో ఎవరెవరికి చోటు దక్కుతుందో వేచిచూడాలి.
News November 22, 2025
ప్రకాశం: విద్యుత్ వినియోగదారులకు కీలక సూచన

ప్రకాశం జిల్లా విద్యుత్ వినియోగదారులకు జిల్లా విద్యుత్ శాఖ SE కట్టా వెంకటేశ్వర్లు శనివారం కీలక సూచన చేశారు. ఒంగోలులోని తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. రేపు ఆదివారం సెలవు దినం అయినప్పటికీ విద్యుత్ బిల్లులను చెల్లించే కేంద్రాలు అందుబాటులో ఉంటాయన్నారు. విద్యుత్ వినియోగదారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు.


