News April 2, 2025

తలంబ్రాల బుకింగ్‌లో ఉమ్మడి కరీంనగర్ రికార్డు

image

రాములవారి కళ్యాణ తలంబ్రాల బుకింగ్‌లో KNR రీజియన్ దూసుకుపోతోందని ఆర్టీసీ లాజిస్టిక్స్ ఏటీఎం రామారావు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 6000 రాములోరి కళ్యాణ ముత్యాల తలంబ్రాలు బుకింగ్ అయినట్లు తెలిపారు. సీతారాముల వారి కళ్యాణానికి వెళ్లలేని భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ కార్గో ద్వారా సీతారాముల కళ్యాణ తలంబ్రాలను ఇంటి వద్దకే పంపించే ఏర్పాటు చేశామన్నారు.

Similar News

News October 25, 2025

డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీలో ఉద్యోగాలు

image

<>DRDO <<>>అనుబంధ సంస్థ డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ 5 రీసెర్చ్ అసోసియేట్, సీనియర్ రీసెర్చ్ ఫెలో, జూనియర్ రీసెర్చ్ ఫెలో, ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. MS, MSc, ME, M.TECH, పీహెచ్‌డీ, బీఈ, బీటెక్, నెట్, గేట్ అర్హతగల అభ్యర్థులు అక్టోబర్ 31 వరకు అప్లై చేసుకోవచ్చు. షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.drdo.gov.in/

News October 25, 2025

KNR: పోలీస్ ట్రైనింగ్ కళాశాలలో రక్తదాన శిబిరం

image

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకొని, కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్ కళాశాల (పీటీసీ)లో “GIVE BLOOD – SAVE LIFE” నినాదంతో భారీ రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. సమాజం కోసం ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరులను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. పీటీసీలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన కళాశాల అధికారులను సీపీ అభినందించారు.

News October 25, 2025

అమరవీరుల త్యాగాలు వృథా కావు: ఎస్పీ

image

పోలీస్ అమరవీరుల త్యాగాలు ఎప్పటికీ వృథా కావని సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్ పేర్కొన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం ఆవరణలో శనివారం రక్తదాన శిబిరం నిర్వహించారు. పోలీసులు శాంతి భద్రతలకే కాకుండా, సేవా కార్యక్రమాల్లో కూడా ఎల్లప్పుడూ ముందుంటారని ఎస్పీ తెలిపారు. అమరుల ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు.