News March 19, 2024
తలమడుగు: పురుగుల మందు తాగి వ్యక్తి SUICIDE

తలమడుగు మండలం బరంపూర్ గ్రామానికి చెందిన కాకర్ల ఆశరెడ్డి (55) అనే రైతు అప్పుల బాధ భరించలేక మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల వివరాల ప్రకారం.. ఇవాళ ఉదయం ఇంట్లో ఎవరికి చెప్పకుండా పొలానికి వెళ్లాడు. అక్కడ పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పంట దిగుబడి రాక.. బ్యాంకు అప్పులు పెరగడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డారని వారు పేర్కొన్నారు.
Similar News
News December 11, 2025
నార్నూర్: డబ్బులు పంచుతూ దొరికిన అభ్యర్థి భర్త

సర్పంచ్ అభ్యర్థి భర్తపై కేసు నమోదు చేసిన ఘటన నార్నూర్లో చోటుచేసుకుంది. ఎఫ్ఎస్టీ టీమ్ ఇన్ఛార్జ్ సొరాజి వివరాల ప్రకారం.. ఈనెల 10న మండల కేంద్రంలోని ముస్లిం వాడలో ఓ వ్యక్తి ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లకు డబ్బులు పంచుతున్నాడనే సమాచారంతో ఆకస్మికంగా తనిఖీ చేశారు. విజయనగర్ కాలనీకి చెందిన సర్పంచ్ అభ్యర్థి భర్త ఆడే సురేశ్ వద్ద నుంచి రూ.10వేలు స్వాధీనం చేసి కేసు నమోదు చేశామని వెల్లడించారు.
News December 11, 2025
ఆదిలాబాద్ జిల్లాలో 40.37% పోలింగ్ నమోదు

ఆదిలాబాద్ జిల్లాలో తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఉదయం 11 గంటల వరకు 40.37 శాతం పోలింగ్ నమోదైందని జిల్లా పంచాయతీ అధికారి రమేశ్ తెలిపారు. మండలాల వారీగా పోలింగ్ శాతం వివరాలు ఇలా ఉన్నాయి. ఇచ్చోడలో 35.61%, సిరికొండ 60.21%, ఇంద్రవెల్లి 33.14%, ఉట్నూర్ 38.59%, నార్నూర్ 45.11%, గాదిగూడలో 53.77% నమోదైంది. ఓటర్లు చురుగ్గా పాల్గొంటున్నారు.
News December 11, 2025
నిబంధనలు పాటించకుంటే కేసు నమోదు: ఎస్పీ కాజల్ సింగ్

ఆదిలాబాద్ జిల్లాలో ఆరు మండలాల్లో జరుగుతున్న మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలో నిర్వహించరాదని అదనపు ఎస్పీ కాజల్ సింగ్ తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ర్యాలీలను నిర్వహించిన వారిపై కేసులను నమోదు చేయబడతాయని హెచ్చరించారు. సంబరాల పేరుతో టపాసులు కాల్చవద్దన్నారు. 936 మంది సిబ్బందితో పోలీస్ యంత్రాంగం ప్రతిష్ఠమైన బందోబస్తు చర్యలను చేపట్టిందని తెలిపారు.


