News August 19, 2024
తల్లంపాడు కిట్స్ కళాశాల సమీపంలో రోడ్డుప్రమాదం

ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడు కిట్స్ కళాశాల సమీపంలో ఆదివారం అర్ధరాత్రి రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. కూసుమంచి మండలం జీళ్ళచెరువుకి చెందిన ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తుండగా కుమ్మరి కుంట్ల మహేష్ అనే యువకుడు మృతి చెందాడు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
Similar News
News November 20, 2025
ఖమ్మం జిల్లాలో 43 బ్లాక్ స్పాట్ల గుర్తింపు

మొంథా తుఫాన్ ప్రభావంతో ఖమ్మం జిల్లాలో రహదారులు దెబ్బతిన్నాయి. జిల్లాలో 43బ్లాక్ స్పాట్లను అధికారులు గుర్తించారు. NHAIపరిధిలో 4చోట్ల, జాతీయ రహదారుల్లో 33చోట్ల, ఇతర రోడ్లపై 6చోట్ల ప్రమాదకర ప్రాంతాలు ఉన్నాయి. జిల్లాలో 126కిలోమీటర్ల మేర రోడ్లు ధ్వంసమైనట్లు నివేదికలో తేలింది. మరమ్మతుల కోసం రూ.15కోట్లు అవసరమని అంచనా వేశారు. మున్సిపల్ పరిధిలోని 470గుంతల పూడ్చివేతకు 6ప్యాకేజీలుగా టెండర్లు చేపట్టారు.
News November 20, 2025
రేగళ్లపాడు సెక్రటరీని సస్పెండ్ చేసిన కలెక్టర్

ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల మంజూరుకు లంచం డిమాండ్ చేసిన పంచాయతీ కార్యదర్శి శివమాధవరావు సస్పెండయ్యారు. సత్తుపల్లి(M) రేగళ్లపాడులో లబ్ధిదారులు ఎడుకొండలు, సీతకు బిల్లులు చెల్లించేందుకు కార్యదర్శి ఈ నెల 4న రూ. 10 వేలు డిమాండ్ చేశారు. బాధితులు టోల్ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయగా, హౌసింగ్ ఈఈ శ్రీనివాస్ విచారణ చేపట్టారు. ఈఈ నివేదిక ఆధారంగా కలెక్టర్ కార్యదర్శిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
News November 20, 2025
ఖమ్మం: గంజాయి కేసు.. ఇద్దరికి 20 ఏళ్ల జైలు శిక్ష

గంజాయి కేసులో పట్టుబడిన ఇద్దరు నిందితులకు ఖమ్మం మొదటి అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి కె. ఉమాదేవి బుధవారం సంచలన తీర్పు చెప్పారు. ఇద్దరికి 20 ఏళ్ల జైలు శిక్ష, ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున జరిమానా విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. తీర్పు అనంతరం ప్రాసిక్యూషన్కు సహకరించిన అధికారులను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ప్రత్యేకంగా అభినందించారు.


