News March 17, 2025
తల్లి దశదినకర్మ రోజే విగతజీవిగా తనయుడు

మంగోల్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తల్లి దశదినకర్మ రోజే తనయుడు విద్యుత్ ఘాతంతో విగతజీవిగా మారాడు. వివరాలిలా.. ముదిరాజ్ కాలనీకి చెందిన కొండ సత్తెవ్వ దశదినకర్మను కులసంఘం భవనంలో నిర్వహిస్తున్నారు. కార్యక్రమపనుల్లో సమగ్నమైన కొడుకు కృష్ణభవనం ఎదురుగా ఉన్న ఇంట్లో బట్టలు ఆరవేస్తున్న సమయంలో కరెంట్షాక్కు గురై గాయపడ్డాడు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
Similar News
News March 18, 2025
అన్నవరం-బాపట్ల కోస్టల్ రైల్వే కారిడార్ ఏర్పాటు చేయాలి

అన్నవరం నుంచి బాపట్ల వరకు కోస్టల్ రైల్వే కారిడార్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కాకినాడ ఎంపీ ఉదయ శ్రీనివాస్ సోమవారం పార్లమెంటులో కోరారు.రైల్వే శాఖ డిమాండ్స్ ఫర్ గ్రాండ్స్పై జరిగిన చర్చలో భాగంగా ఆయన ఈ విషయం లేవనెత్తారు. ఏపీలో 947 కిలోమీటర్ల సుధీర తీర ప్రాంతం ఉందని, ప్రధాన పోర్టు లు ఉన్నప్పటికీ రైల్వే కారిడార్ లేదన్న విషయాన్ని గుర్తు చేశారు. తన ప్రతిపాదన పరిశీలనలోకి తీసుకోవాలని కోరారు.
News March 18, 2025
సిద్ధార్థ్ను అభినందించిన సీఎం

అనంతపురానికి చెందిన 14ఏళ్ల బాలుడు సిద్ధార్థ్ నంద్యాల సీఎం చంద్రబాబును కలిశారు. ఏఐ సాయంతో గుండెజబ్బులు నిర్ధారించే సిర్కాడియావీ యాప్ను రూపొందించిన సిద్ధార్థ్ను సీఎం అభినందించారు. అరగంట పాటు అతడితో ముచ్చటించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందిస్తామని, మరిన్ని ఆవిష్కరణలు చేయాలని బాలుడిని సీఎం ప్రోత్సహించారు. కాగా సిద్ధార్థ్ రూపొందించిన యాప్ 7 సెకన్లలోనే గుండె పనితీరు చెప్పేస్తుంది.
News March 18, 2025
బుట్టాయిగూడెం: గుబ్బల మంగమ్మ తల్లి సేవలో నటుడు నితిన్

బుట్టాయిగూడెం మండలం ఏజెన్సీ ప్రాంతంలోని శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి అమ్మవారిని తెలుగు సినీ నటుడు నితిన్ సోమవారం దర్శించుకున్నాడు. ఈ సందర్భంగానే అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తను నూతనంగా నటించిన రాబిన్ హుడ్ సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని, చిత్రం ఘన విజయం సాధించాలని అమ్మవారిని కోరుకున్నట్లు నటుడు నితిన్ తెలిపాడు