News August 2, 2024
తల్లి పాలే బిడ్డకు శ్రేయస్కరం: కలెక్టర్ శివశంకర్

తల్లిపాలే బిడ్డకు శ్రేయస్కరమని కడప జిల్లా కలెక్టర్ శివశంకర్ పేర్కొన్నారు. గురువారం ఆయన ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో తల్లిపాల వారోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. బిడ్డకు తొలి ఆహారం తల్లి పాలేనని, టీకా కూడా తల్లిపాలతో సమానమేనన్నారు. శిశువు ఆరోగ్యంగా ఎదగాలంటే 100% తల్లిపాలు ఎంతో అవసరమని స్పష్టం చేశారు.
Similar News
News December 20, 2025
అన్నమయ్య: ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచార యత్నం

అభం, శుభం తెలియని ఎనిమిదేళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచార యత్నానికి ఒడిగట్టాడు. ఈ ఘటన శుక్రవారం మదనపల్లె మండలంలో చోటుచేసుకుంది. బాధితులు పోలీసులకిచ్చిన ఫిర్యాదు మేరకు.. మండలానికి చెందిన ఎనిమిదేళ్ల బాలికకు తల్లిదండ్రులు లేరు. అవ్వ చెంతనే ఉంటోంది. అవ్వ కూలి పనులు చేసుకుంటూ పాపను పోషించుకుంటూ చదివిస్తోంది. బాలిక పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన తరువాత యువకుడు అత్యాచారయత్నానికి ఒడిగట్టాడు.
News December 19, 2025
కడప: ట్రాక్టర్ చక్రాల కిందపడి వ్యక్తి మృతి

ట్రాక్టర్పై నుంచి కింద పడి అదే వాహన చక్రాల కింద పడి వ్యక్తి మృతి చెందిన ఘటన రాజుపాలెం మండలం వెలవలి సాయిబాబా దేవాలయం సమీపంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. నాగరాజు కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఉదయం వేళ అతను కూలి పనులకు వెళ్లాడు. తిరిగి సాయంత్రం ఇంటికి వస్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కింద పడి మృతి చెందాడు.
News December 19, 2025
కడప: ప్రజలకు APS RTC గుడ్ న్యూస్..!

YSR కడప జిల్లాలోని ప్రజలకు APS RTC శుభవార్త తెలిపింది. APS RTC కార్గో విభాగం డిసెంబర్ 20 నుంచి 2026 జనవరి 19 వరకు డోర్ డెలివరీ మాసోత్సవాన్ని నిర్వహిస్తోంది. రాష్ట్రంలోని 84 ముఖ్య పట్టణాల్లో 10 కిలోమీటర్ల పరిధిలో, 50 కేజీల వరకు సరుకులను నేరుగా ఇంటి వద్దకే చేరవేసే ఈ సేవ ప్రజలకు ఎంతో ఉపయోగకరమని అధికారులు తెలిపారు. ఈ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.


