News February 28, 2025

తాండూరులో యాక్సిడెంట్.. తండ్రి కళ్లముందే కొడుకు దుర్మరణం

image

రోడ్డు ప్రమాదంలో తండ్రి కళ్లముందే కొడుకు మృతిచెందిన విషాద ఘటన వికారాబాద్ జిల్లాలో జరిగింది. స్థానికుల సమాచారం మేరకు.. తాండూరులో చెంగోల్ బైపాస్ వద్ద తండ్రి, కొడుకు వెళ్తున్న స్కూటీని వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో కొడుకు నర్సింలు స్కూటీ పైనుంచి కిందపడి అక్కడికక్కడే మృతి చెందగా, తండ్రి గోపయ్యకు గాయాలయ్యాయి. గోపయ్యకు తాండూరు ఆసుపత్రిలో చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ తరలించారు.

Similar News

News November 17, 2025

మాట్లాడుకుంటేనే సమస్యలకు పరిష్కారం

image

భార్యాభర్తల ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు వస్తుంటాయి. కొన్నిసార్లు అహం, ఇంకొన్నిసార్లు అపార్థాలు పలకరిస్తాయి. అలకలూ ఉంటాయి. వాటిని దాటితేనే బంధం పదిలంగా మారుతుంది. అభిప్రాయ భేదాలు వచ్చి అలిగినా తెగేదాకా లాగొద్దు. పరోక్ష వ్యాఖ్యానాలు చేయొద్దు. నేరుగానే పరిష్కరించుకోండి. సమస్య ఏదైనా ఎదుటివారికి మాట్లాడే అవకాశం ఇవ్వాలి. లేదంటే సమస్య పరిష్కారం కాకపోగా అవతలివారిలో రోజు రోజుకీ అసంతృప్తి పెరిగిపోతుంది.

News November 17, 2025

కాంగ్రెస్ ప్లాన్ B: తప్పించకముందే.. తప్పించుకుంటే!

image

BRS నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై ఫిరాయింపు వేటు పడకుండా ఉండేందుకు కాంగ్రెస్ పథకం రచిస్తోంది. అనర్హత వేటు పడకముందే రాజీనామా చేయించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే ఎప్పుడు చేయాలనే విషయం సీఎం నిర్ణయిస్తారని సమాచారం. కాంగ్రెస్ తరఫున సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా దానం పోటీచేయడంతో ఆయన అధికారికంగా పార్టీ మారినట్లే లెక్కని రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది.

News November 17, 2025

అనకాపల్లి: ‘ఐటీఐతో జర్మనీలో ఉద్యోగాలు’

image

జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 19వ తేదీన ఎలమంచిలి సూర్య ఐటీఐ కళాశాలలో ప్రత్యేక జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు సంస్థ జిల్లా అధికారి గోవిందరావు తెలిపారు. ఐటీఐ ఎలక్ట్రీషియన్ చేసి రెండేళ్లు అనుభవం ఉన్న అభ్యర్థులకు జర్మనీలో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు చెప్పారు. పాస్ పోర్ట్, విద్యార్హత ధ్రువపత్రాలతో జాబ్ మేళాకు హాజరు కావాలన్నారు. ముందు పోర్టల్‌లో నమోదు చేసుకోవాలన్నారు.