News December 10, 2024
తాండూరు: ఆర్థిక ఇబ్బందులతో కుటుంబం ఆత్మహత్యాయత్నం
కుటుంబసభ్యులంతా ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన తాండూరు మండలంలోని కాసిపేట గ్రామంలో జరిగింది. మొండయ్య(60), శ్రీదేవి(50) దంపతులు, వారి కుమార్తె చిట్టి(30), కుమారుడు శివప్రసాద్ (26) ఆర్థిక ఇబ్బందులు తాళలేక పురుగు మందు తాగారు. కాగా వారిని మెరుగైన చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. ప్రస్తుతం నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Similar News
News January 24, 2025
రైల్వే జీఎంను కలిసిన ఆదిలాబాద్ ఎంపీ నగేష్
సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ను సికింద్రాబాద్లోని ఆయన కార్యాలయంలో ఆదిలాబాద్ ఎంపీ గొడం నగేష్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని రైల్వే అభివృద్ధి పనులతో పాటు రైల్వే స్టేషన్లను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. రైళ్ల సంఖ్యను పెంచాలని కోరారు. ఈ విషయాలపై రైల్వే జిఎం సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ తెలిపారు.
News January 24, 2025
ADB: JAN 28 నుంచి కందుల కొనుగోళ్లు
పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేది నుంచి కందుల కొనుగోలు ప్రారంభమవుతాయని మార్క్ ఫెడ్ డీఏం ప్రవీణ్ రెడ్డి గురువారం తెలిపారు. ఈనెల 30 నుంచి జైనథ్ మార్కెట్ యార్డ్లో సైతం కొనుగోలు ప్రారంభమవుతాయన్నారు. రైతులు ఈ విషయాన్ని గమనించి కందులను మార్కెట్ యార్డుకు తీసుకొని రావాలని సూచించారు.
News January 24, 2025
ADB: జిల్లాలో మరో కౌలు రైతు ఆత్మహత్య
ఆదిలాబాద్ జిల్లాలో రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పలువురు ఆత్మహత్యలు చేసుకోగా తాజాగా బేల మండలంలోని మీర్జాపూర్ గ్రామానికి చెందిన కౌలు రైత గోవింద్ గురువారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. 4 ఎకరాల కౌలు భూమిలో పత్తి సాగు చేయగా, దిగుబడి రాక పురుగుల మందు తాగి పొలంలో ఆత్మహత్య చేసుకున్నాడని పేర్కొన్నారు. మృతుడికి రూ.5లక్షల అప్పు ఉన్నట్లు సమాచారం.