News December 19, 2024
తాండూరు: పత్రాలు లేని వాహనాలకు జరిమానా
తాండూరు మండలంలోని పోలీస్ స్టేషన్ పరిధి అండర్ బ్రిడ్జి ఐబీ చౌరస్తా వద్ద సీఐ కుమారస్వామి, ఎస్సై కిరణ్ కుమార్, మాదారం ఎస్సై సౌజన్య వాహన తనిఖీలను నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనాల పత్రాలను పరిశీలించి సరైన ధ్రువీకరణ పత్రాలు లేని వాహనాలకు జరిమానా విధించారు. సీఐ మాట్లాడుతూ..ప్రతి వాహనా దారులు వాహనానికి సంబంధించిన ధృవీకరణ పత్రాలను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.
Similar News
News January 13, 2025
బ్యాంకు సామగ్రి చోరీకి యత్నం.. ఒకరికి రిమాండ్: CI
ఆదిలాబాద్ కలెక్టరేట్లోని SBI బ్యాంకు సామగ్రిని చోరీ చేయటానికి ఆదివారం దుండగులు యత్నించినట్లు టూటౌన్ సీఐ కరుణాకర్ తెలిపారు. ఇద్దరు దుండగులు బ్యాంకు పాత ఫర్నీచర్, నగదు లెక్కించే చెడిపోయిన యంత్రం చోరీకి ప్రయత్నిస్తుండగా.. వాచ్మెన్ నర్సింలు గమనించారు. ఆయన పోలీసులకు సమాచారం అందించడంతో వారు పరారయ్యారు. వీరిలో ఒకరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని మరో నిందితుడి కోసం గాలిస్తున్నట్లు సీఐ తెలిపారు.
News January 13, 2025
కోటపల్లి: కోడి పందెం స్థావరంపై పోలీసుల దాడులు
కోటపల్లి మండలంలోని నాగంపేట బొప్పారం గ్రామ శివారున ఉన్న అటవీ ప్రాంతంలో కోడిపందేల స్థావరంపై ఆదివారం ఎస్సై రాజేందర్ సిబ్బందితో దాడులు నిర్వహించారు. ఎస్సై కథనం ప్రకారం.. దాడుల్లో ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామన్నారు. అలాగే 10 కోళ్లు, 7 మొబైల్స్ రూ.59,780 నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే 4 బైక్లు సీజ్ చేసి కేసు నమోదు చేసినట్టు SI తెలిపారు.
News January 13, 2025
నేడు ఆసిఫాబాద్ జిల్లాకు మంత్రి సీతక్క రాక
రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క సోమవారం కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు రానున్నట్లు మంత్రి పీఏ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా కేంద్రంతో పాటు రెబ్బన, వాంకిడి, కెరమెరి మండలాల్లో జంగు బాయి దేవత సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారన్నారు. అక్కడ నుంచి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు.