News March 19, 2025
తాండూర్: ఇంటి పన్ను వసూలు 74% జిల్లాలోని చివరి స్థానం

తాండూర్ మండల వ్యాప్తంగా 33 గ్రామపంచాయతీలో నేటి వరకు 74% ఇంటి పన్ను వసూలు అయినట్లు మండల పంచాయతీ అధికారులు తెలిపారు. 33 గ్రామపంచాయతీలో 100% కంటే తక్కువ ఇంటి పన్ను వసూలు అయిందని, మార్చి చివరి నాటికి 100% ఇంటి పన్ను వసూళ్లే లక్ష్యంగా పంచాయతీ కార్యదర్శులు ముమ్మరంగా పని చేయాలని ఇప్పటికే అధికారుల నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. జిల్లాలోనే చివరి స్థానంలో ఇంటి పన్ను వసూళ్లలో తాండూరు మండలం ఉంది.
Similar News
News October 27, 2025
సైబర్ నేరాల వలలో చిక్కితే 1930కి CALL

RGM ఓపెన్ హౌస్లో పాల్గొన్న కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ.. విద్యార్థులు సైబర్ నేరాల వలలో పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సైబర్ మోసాలు జరిగితే వెంటనే 1930 టోల్ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయాలన్నారు. పోలీసులు కేవలం నేరస్థులను పట్టుకోవడమే కాకుండా సమాజ భద్రత, చట్ట అవగాహన పెంపు కోసం నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. మహిళల రక్షణకు షీ టీమ్స్, భరోసా సెంటర్లు చేస్తున్న సేవలను వివరించారు.
News October 27, 2025
దివ్యాంగుల చట్టం వాల్ పోస్టర్ ఆవిష్కరించిన భద్రాద్రి ఎస్పీ

కొత్తగూడెం పట్టణంలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో దివ్యాంగుల చట్టం 2016 సంబంధించిన వాల్ పోస్టర్లను సోమవారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ.. దివ్యాంగుల చట్టం 2016 ప్రకారం దివ్యాంగులను కించపరిచినా, అవహేళనగా మాట్లాడినా, ఎగతాళి చేసిన చట్టం ప్రకారం శిక్షకు గురి అవుతారని అన్నారు.
News October 27, 2025
తుఫాన్ ఎఫెక్ట్.. 43 రైళ్లు రద్దు!

‘మొంథా’ తుఫాన్ ప్రభావంతో ఏపీ మీదుగా నడిచే 43 రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే వెల్లడించింది. ఇవాళ్టి నుంచి ఎల్లుండి వరకు కొన్ని రైళ్లు రద్దు చేసినట్లు పేర్కొంది. ప్రయాణికుల భద్రత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ప్రయాణానికి ముందు రైల్ స్టేటస్ చూసుకోవాలని సూచించింది.
* ట్రైన్స్ లిస్ట్ కోసం పైన ఫొటోలను స్లైడ్ చేయండి.


