News March 29, 2025
తాండూర్ ఎంపీడీవో గదిలో పాము కలకలం

వికారాబాద్ జిల్లా తాండూర్ మండల పరిషత్ కార్యాలయంలోని ఎంపీడీవో గదిలో గురువారం పాము ప్రత్యక్షమైంది. అటెండర్ రోజూలానే గదిని శుభ్రం చేసేందుకు వెళ్లగా పాము కనిపించింది. దీంతో సిబ్బందికి సమాచారం ఇవ్వగా చంపేశారు. కార్యాలయ పరిసరాల్లో పిచ్చి మొక్కలు, ముళ్లపొదలు ఉండటంతో విష సర్పాలు సంచరిస్తున్నాయని సిబ్బంది చెబుతున్నారు. కార్యాలయాల్లో పరిసరాలను పరిశుభ్రం చేయాలని పలువురు కోరుతున్నారు.
Similar News
News October 17, 2025
నారాయణమూర్తి దంపతులపై సిద్దరామయ్య ఫైర్

సామాజిక సర్వేపై ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి దంపతుల <<18022008>>కామెంట్స్పై<<>> కర్ణాటక CM సిద్దరామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇది వెనుకబడిన కులాల సర్వే కాదని 20 సార్లు చెప్పాం. వారికి అర్థం కాకపోతే నేనేం చేయాలి. ఇన్ఫోసిస్ ఉందని వారికి అన్నీ తెలుసనుకుంటున్నారా? ఇది పూర్తిగా పాపులేషన్ సర్వే. మరి కేంద్రం చేపడుతున్న సర్వేపై ఏమంటారు?’ అని ప్రశ్నించారు. అటు సర్వేపై ఎవరినీ బలవంతం చేయమని Dy.CM శివకుమార్ అన్నారు.
News October 17, 2025
HYD: రాసిపెట్టుకో.. కారు పర్మినెంట్గా ఫాంహౌస్కే: కాంగ్రెస్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో BRS, కాంగ్రెస్ మధ్య రాజకీయం నువ్వానేనా అన్నట్లుగా మారింది. ‘పదేళ్ల విధ్వంసానికి రెండేళ్ల అభివృద్ధికి మధ్య జరుగుతున్న ఎన్నిక ఇది KTR!.. నువ్వు ఎంత తిమ్మిని బమ్మి చేసినా మీ BRSను జూబ్లీహిల్స్ ప్రజలు నమ్మరు. మీ సానుభూతి డ్రామాలు నమ్మి మోసపోయే స్థితిలో ఇక్కడి జనం లేరు.. ఈ ఎన్నిక తర్వాత మీ కారు ఇక శాశ్వతంగా ఫాంహౌస్కే.. రాసిపెట్టుకో!!’ అని Xలో Tకాంగ్రెస్ ట్వీట్ చేసింది.
News October 17, 2025
HYD: రాసిపెట్టుకో.. కారు పర్మినెంట్గా ఫాంహౌస్కే: కాంగ్రెస్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో BRS, కాంగ్రెస్ మధ్య రాజకీయం నువ్వానేనా అన్నట్లుగా మారింది. ‘పదేళ్ల విధ్వంసానికి రెండేళ్ల అభివృద్ధికి మధ్య జరుగుతున్న ఎన్నిక ఇది KTR!.. నువ్వు ఎంత తిమ్మిని బమ్మి చేసినా మీ BRSను జూబ్లీహిల్స్ ప్రజలు నమ్మరు. మీ సానుభూతి డ్రామాలు నమ్మి మోసపోయే స్థితిలో ఇక్కడి జనం లేరు.. ఈ ఎన్నిక తర్వాత మీ కారు ఇక శాశ్వతంగా ఫాంహౌస్కే.. రాసిపెట్టుకో!!’ అని Xలో Tకాంగ్రెస్ ట్వీట్ చేసింది.