News March 29, 2025
తాండూర్ ఎంపీడీవో గదిలో పాము కలకలం

వికారాబాద్ జిల్లా తాండూర్ మండల పరిషత్ కార్యాలయంలోని ఎంపీడీవో గదిలో గురువారం పాము ప్రత్యక్షమైంది. అటెండర్ రోజూలానే గదిని శుభ్రం చేసేందుకు వెళ్లగా పాము కనిపించింది. దీంతో సిబ్బందికి సమాచారం ఇవ్వగా చంపేశారు. కార్యాలయ పరిసరాల్లో పిచ్చి మొక్కలు, ముళ్లపొదలు ఉండటంతో విష సర్పాలు సంచరిస్తున్నాయని సిబ్బంది చెబుతున్నారు. కార్యాలయాల్లో పరిసరాలను పరిశుభ్రం చేయాలని పలువురు కోరుతున్నారు.
Similar News
News November 18, 2025
మంత్రి సత్యకుమార్ పేరుతో ఫేక్ TTD లెటర్లు!

రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ పేరుతో నకిలీ TTD లెటర్లు జారీకావడం కలకలం రేపుతోంది. ఈ మేరకు మంత్రి సత్యకుమార్ కార్యాలయానికి ఫిర్యాదు వచ్చింది. కొన్నిరోజులుగా మంత్రి పేరుతో నకిలీ లెటర్లు ఉపయోగిస్తున్నట్లు సమాచారం అందిందని ఆయన సిబ్బంది పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడతామన్నారు.
News November 18, 2025
మంత్రి సత్యకుమార్ పేరుతో ఫేక్ TTD లెటర్లు!

రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ పేరుతో నకిలీ TTD లెటర్లు జారీకావడం కలకలం రేపుతోంది. ఈ మేరకు మంత్రి సత్యకుమార్ కార్యాలయానికి ఫిర్యాదు వచ్చింది. కొన్నిరోజులుగా మంత్రి పేరుతో నకిలీ లెటర్లు ఉపయోగిస్తున్నట్లు సమాచారం అందిందని ఆయన సిబ్బంది పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడతామన్నారు.
News November 18, 2025
ప్రకాశం: మనవడిపై ఫిర్యాదు చేసిన అవ్వ.!

ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం నాగంపల్లికి చెందిన 80ఏళ్ల వృద్ధురాలు సోమవారం SP హర్షవర్ధన్ రాజుకు ఫిర్యాదు చేసింది. మనవడు తనను పలుమార్లు కొట్టాడని వృద్ధురాలు ఆరోపించింది. కోడలు తీసుకున్న డబ్బులు ఇవ్వడంలేదని కూడా ఫిర్యాదు చేసింది. SP హర్షవర్ధన్ రాజు వృద్ధురాలితో ఆప్యాయంగా మాట్లాడి విషయాన్ని తెలుసుకున్నారు. అనంతరం ఆయన విచారణకు ఆదేశించారు.


