News April 3, 2025
తాండూర్: తాగొచ్చి.. భార్య, అత్తను కొట్టాడు: SI

తాండూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భార్య, అత్తను కొట్టిన కేసులో ఒకరిని అరెస్టు చేసినట్లు ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు. ఎస్సై వివరాల ప్రకారం.. మార్చి 16న అచలాపూర్ గ్రామపంచాయతీ కొమ్ముగూడెంకు చెందిన దాగం మల్లేశ్ అనే వ్యక్తి మద్యం తాగి వచ్చి ఇంట్లో గొడవ పడ్డారు. భార్య లావణ్య, అత్త రాజు అడ్డుపడగా.. వారిని కబ్గిరి గరిటతో తలపై బలంగా కొట్టి గాయపర్చాడు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పేర్కొన్నారు.
Similar News
News November 15, 2025
NGKL: రేపటి నుంచి అంబేడ్కర్ ఓపెన్ డిగ్రీ తరగతులు

నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం పరిధిలోని ఓపెన్ డిగ్రీ విద్యార్థులకు ప్రథమ, తృతీయ, ఐదో సెమిస్టర్ తరగతులు NOV 16వ తేదీ ప్రారంభం కానున్నాయని కళాశాల ప్రిన్సిపల్ మదన్ మోహన్, సార్వత్రిక అధ్యయన కేంద్రం సమన్వయకర్త ఎం.అంజయ్య తెలిపారు. విద్యార్థులు తప్పనిసరిగా తరగతులకు హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News November 15, 2025
స్కిల్ బేస్డ్ గేమింగ్ యాప్ను మాత్రమే ప్రమోట్ చేశా: రానా

TG: బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల కేసులో సినీ నటుడు దగ్గుబాటి రానాను CID సిట్ విచారించింది. తన బ్యాంకు వివరాలను అధికారులకు రానా అందించారు. స్కిల్ బేస్డ్ గేమింగ్ యాప్ను మాత్రమే తాను ప్రమోట్ చేశానని సిట్కు తెలిపినట్లు రానా పేర్కొన్నారు. అన్నీ పరిశీలించాకే బెట్టింగ్ యాప్ సంస్థతో ఒప్పందం చేసుకున్నానని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా పనిచేసే ఏ సంస్థతోనూ ఒప్పందం చేసుకోలేదని స్పష్టం చేశారు.
News November 15, 2025
GNT: రైతు Hi అంటే చాలు.. ధాన్యం కొనుగోలు

రైతులకు ధాన్యం విక్రయాన్ని సులభం చేస్తూ కొత్త వాట్సాప్ సేవలను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇకపై 7337359375 నంబర్కు “Hi” పంపితే వెంటనే సేవలు అందుబాటులోకి వస్తాయి. రైతులు అమ్మదలచిన ధాన్య రకం, బస్తాల సంఖ్య, దగ్గర్లోని కేంద్రం, తేదీ-సమయం వివరాలు పంపగానే స్లాట్ ఆటోమేటిక్గా బుక్ అవుతుంది. ధాన్యం అమ్మకాల్లో ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా కొనుగోలు చేసే దిశగా ఈ చర్య ముందడుగుగా రైతులు భావిస్తున్నారు.


