News February 8, 2025
తాండూర్: పింఛను డబ్బుల కోసం నానమ్మపై దాడి!

పింఛన్ డబ్బుల కోసం నానమ్మపై దాడి చేసిన ఘటన కర్ణకోట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ విట్టల్ రెడ్డి వివరాలిలా.. చెంగోల్ గ్రామానికి చెందిన మానెమ్మను ఆమె మనవడు నరేశ్ పింఛన్ డబ్బులు ఇవ్వాలని వేధించాడు. ఆమె ఇచ్చేందుకు నిరాకరించడంతో కోపంతో నరేశ్ ఇంట్లో ఉన్న ఇనుప రాడ్డు తీసుకుని తలపై దాడి చేశాడు. గాయపడ్డ ఆమెను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Similar News
News November 12, 2025
HYD: వచ్చే ఏడాది నుంచి ఓయూలో కొత్త కోర్సులు

స్వయం పోర్టల్ వేదికగా 8 కొత్త కోర్సులు సహా పదకొండు కోర్సుల రూపకల్పన కోసం ఓయూ ఎడ్యుకేషనల్ మల్టీ మీడియా రీసెర్చ్ సెంటర్ ఈఎంఆర్సీ ఒప్పందం కుదుర్చుకుంది. ఆయా కోర్సుల్లో 50 చొప్పున పాఠ్యాంశాల రూపకల్పన కోసం వీసీ ఆచార్య కుమార్ మొలుగరం సమక్షంలో కోర్సు కోఆర్డీనేటర్లు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్ ఈఎంఆర్సీ పి.రఘుపతి ఎంఓఏ పై సంతకం చేశారు. 2026 జనవరి, జూలై సెమిస్టర్లలో ఈ కోర్సులు అందుబాటులో రానున్నాయి.
News November 12, 2025
కూతురు పుట్టిందని చూసేందుకు వెళ్తూ తండ్రి మృతి

భార్య కూతురికి జన్మనివ్వడంతో చూసేందుకు వెళ్తున్న తండ్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో జరిగింది. బుధవారం రాత్రి ధర్మవరం శాంతినగర్కు చెందిన దిలీప్ కుమార్ (25) స్కూటీపై వెళ్తూ బత్తలపల్లి వై జంక్షన్ వద్ద డివైడర్ను ఢీకొన్నాడు. ఈ ఘటనలో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని బత్తలపల్లి పోలీసులు ఆర్డీటీ ఆసుపత్రికి తరలించి, ఘటనపై కేసు నమోదు చేశారు.
News November 12, 2025
ఆదిలాబాద్: రేపు జోనల్ స్థాయి యోగా పోటీలు

ఇచ్చోడ మండలంలోని బోరిగామా జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో 14 – 17 సంవత్సరాల బాలబాలికలకు జోనల్ స్థాయి యోగా పోటీలను ఈ నెల 13న నిర్వహిస్తున్నట్లు DEO రాజేశ్వర్, SGF జిల్లా కార్యదర్శి రామేశ్వర్ పేర్కొన్నారు. ఇందులో గెలుపొందిన వారికి రాష్ట్రస్థాయి యోగా పోటీలు కరీంనగర్ జిల్లాలోని వెలిచల రామడుగు జిల్లా పరిషత్ పాఠశాలలో ఉంటాయని పేర్కొన్నారు. 15, 16, 17 మూడు రోజులపాటు రాష్ట్ర స్థాయి పోటీలు జరుగుతాయని వివరించారు.


