News April 6, 2024

తాంసీ: పెళ్లి కావటం లేదని యువకుడి ఆత్మహత్య

image

పెళ్లి కావడం లేదని యువకుడు మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్న ఘటన బోథ్ మండలంలో జరిగింది. ఎస్సై రాము తెలిపిన వివరాల ప్రకారం..మండల కేంద్రంలోని కొత్తగల్లికి చెందిన జాదవ్ జ్ఞానేశ్వర్ (21)కు గత కొంతకాలంగా పెళ్లి సంబంధాలు చూసినప్పటికీ కుదరక పోగా మనస్తాపంతో ఇవాళ ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News December 23, 2025

ADB: ‘ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి’

image

ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలియజేశారు. సోమవారం హైదరాబాదు నుంచి ఇతర ఎన్నికల అధికారులతో కలిసి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి పాల్గొన్నారు. వచ్చే వారంలోగా ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియలో వృద్ధి నమోదు కావాలన్నారు. ఫారం-8 ద్వారా అసలైన ఫోటోగ్రాఫ్ సేకరించి నవీకరించాలని సూచించినట్లు శ్యామలాదేవి పేర్కొన్నారు.

News December 23, 2025

ADB: డాక్యుమెంట్ రైటర్‌పై కేసులు

image

ఆదిలాబాద్ రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లో డాక్యుమెంట్ రైటర్‌గా పని చేస్తున్న సుభాష్ నగర్‌కు చెందిన వెన్నం నవీన్ పై 2 కేసులు నమోదు చేసినట్లు 2టౌన్ CI నాగరాజు తెలిపారు. సదానందం 2023లో కొనుగోలు చేసిన ప్లాటుకు సంబంధించిన దస్తావేజుల్లో హద్దులు సరిచేసి ఇవ్వటానికి రూ.లక్ష తీసుకున్నాడు. అదే విధంగా మరొకరి దగ్గర దస్తావేజుల్లోనూ మార్పులు చేయటానికి రూ.56వేలు తీసుకొని ఇబ్బందులకు గురిచేయగా బాధితులు ఫిర్యాదు చేశారు.

News December 23, 2025

ఉట్నూర్: 7 ఏళ్లకు లభించిన భూమి పట్టా

image

ఉట్నూర్ మండలం తాండ్ర గ్రామానికి చెందిన మండే మల్లారి, సండే సారూబాయ్‌లకు 7 సంవత్సరాలకు భూమి పట్టా లభించిందని ITDA PO యువరాజ్ మర్మాట్ తెలిపారు. సోమవారం పట్టాలను వారికి అందజేశారు. తాండ్ర గ్రామ శివారులో గల 49/23/1/2 సర్వే నంబర్‌లో 5.03 ఎకరాలు, 49/23/3 సర్వే నంబర్‌లో 5.03 ఎకరాల భూమి విస్తీర్ణానికి పట్టా చేసి లబ్ధిదారులకు మంజూరు చేశామన్నారు.