News January 24, 2025
తాగి వాహనం నడిపితే లైసెన్సు రద్దు: DTO మానస

లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని వనపర్తి జిల్లా రవాణా శాఖ అధికారిణి మానస హెచ్చరించారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఆర్టీవో కార్యాలయంలో నిర్వహించిన డ్రైవింగ్ లైసెన్సు మేళాకు విశేష స్పందన లభించిందని అన్నారు. లైసెన్స్ మేళాలో పరీక్షలు నిర్వహించి 35 మందికి లెర్నింగ్ లైసెన్సులు అందజేశారు. మద్యం తాగి వాహనం నడిపితే లైసెన్సు రద్దు చేస్తామన్నారు.
Similar News
News October 19, 2025
జనగామ: కపాస్ కిసాన్ యాప్ను వినియోగించాలి: డీఏఓ

పత్తి పంటను సాగు చేసిన రైతులు కపాస్ కిసాన్ యాప్లో సాగు చేసిన పంట విస్తీర్ణం వివరాలను నమోదు చేసుకోవాలని జనగామ జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని అంబికా సోని తెలిపారు. ఈ యాప్లో వివరాలు నమోదు చేసుకున్న రైతులకు పత్తి విక్రయాల్లో పారదర్శకత ఉంటుందని స్పష్టం చేశారు. కావున రైతులు ఈ యాప్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News October 19, 2025
జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని బాపట్ల కలెక్టర్ వినోద్ కుమార్ ఆదివారం ప్రకటించారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా వర్షంతో పాటు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. భారీ వర్షాలు కురిసే సమయంలో పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. సురక్షిత ప్రాంతాలలో రక్షణ పొందాలని సూచించారు.
News October 19, 2025
జూబ్లీ బైపోల్: ఇప్పటికి 127.. ఉన్నది ఒక్కరోజే!

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నామినేషన్లు జోరందుకున్నాయి. అధికారులు ఊహించని విధంగా నామినేషన్లు వేశారు. ఇప్పటి వరకు 127 మంది పోటీచేస్తామంటూ ముందుకువచ్చారు. నామినేషన్లు వేసేందుకు తుది గడువు 3 రోజుల (21వ తేదీ వరకు) సమయమున్నా.. ఒక్కరోజు మాత్రమే అవకాశం ఉంది. 19 ఆదివారం, 20న దీపావళి కావడంతో మంగళవారం ఆఖరి రోజు. ఇప్పటికే రాష్ట్ర నలుమూలల నుంచి నామినేషన్ వేస్తామని పలువురు ప్రకటించడంతో దీనిపై ఆసక్తి నెలకొంది.