News January 24, 2025
తాగి వాహనం నడిపితే లైసెన్సు రద్దు: DTO మానస

లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని వనపర్తి జిల్లా రవాణా శాఖ అధికారిణి మానస హెచ్చరించారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఆర్టీవో కార్యాలయంలో నిర్వహించిన డ్రైవింగ్ లైసెన్సు మేళాకు విశేష స్పందన లభించిందని అన్నారు. లైసెన్స్ మేళాలో పరీక్షలు నిర్వహించి 35 మందికి లెర్నింగ్ లైసెన్సులు అందజేశారు. మద్యం తాగి వాహనం నడిపితే లైసెన్సు రద్దు చేస్తామన్నారు.
Similar News
News February 23, 2026
ఏలూరు జిల్లాలో టెన్త్ పరీక్షా సమయాలు ఇవే!

ఏలూరు జిల్లాలో టెన్త్ పబ్లిక్ పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధం చేస్తున్నట్లు కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు 133 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతాయని, మొత్తం 14,019 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. పరీక్షలు ప్రతిరోజూ ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు జరుగుతాయని, విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
News February 23, 2026
అనంతపురం: ఫలితాలు విడుదల

అనంతపురం జేఎన్టీయూ పరిధిలో డిసెంబర్, జనవరి నెలల్లో జరిగిన బి.ఫార్మసీ 3-1, 3-2 (R15, R19, R23) రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. సోమవారం డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యూయేషన్ నాగప్రసాద్ నాయుడు, కంట్రోలర్ శివకుమార్ ఈ ఫలితాలను అధికారికంగా ప్రకటించారు. విద్యార్థులు తమ మార్కుల వివరాలను తెలుసుకోవడానికి https://jntuaresults.ac.in/ వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు.
News February 23, 2026
NRPT: కలెక్టరేట్ ప్రజావాణికి 29 ఫిర్యాదులు

ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలనీ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులకు సూచించారు. నారాయణపేట కలెక్టరేట్ ప్రజావాణి సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 29 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు కలెక్టర్కి తమ సమస్యలను విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. అదనపు కలెక్టర్ శ్రీను, అధికారులు పాల్గొన్నారు.


