News February 21, 2025

తాగునీటికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలి: కలెక్టర్

image

నీటి విడుదలలో తాగునీటికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు అన్నారు. కలెక్టరేట్లో ఇరిగేషన్, వ్యవసాయ, ఉద్యానవన, నీటి సరఫరా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రధాన రెండు రిజర్వాయర్లు నీటి కొరత ఉన్నందున సాగునీటి విడుదలకు వారబందీ ప్రక్రియలో నీటిని విడుదల చేయాలన్నారు. అన్ని చెరువులలో పూర్తిస్థాయి నీటి సామర్థ్యం మేరకు మీరు నిల్వ చేయాలని తెలిపారు.

Similar News

News November 20, 2025

శ్రీకాకుళం జిల్లాలో రూ.25 వేల జీతంతో ఉద్యోగాలు

image

శ్రీకాకుళంలో రేపు జిల్లా ఉపాధి అధికారి ఆధ్వర్యంలో జరగనున్న జాబ్ మేళాకు చిక్కోల్ సోలార్ ఎనర్జీ సర్వీసెస్, శ్రీరామ్ చిట్స్ ఫైనాన్స్ కంపెనీలు హాజరుకానున్నాయి. టెన్త్-డిగ్రీ చదివిన పురుష అభ్యర్థులు ఈ మేళాకు అర్హులు. ఎంపికైన వారు శ్రీకాకుళం, నరసన్నపేటలో పని చేయాలని, రూ.15,000-25,000 జీతం ఇస్తారని ఆ శాఖాధికారి సుధా చెప్పారు. దరఖాస్తుకు https://WWW.NCS.GOV.IN వెబ్‌సైట్‌‌ను సంప్రదించాలన్నారు.

News November 20, 2025

NZB: అర్ధరాత్రి వరకు కొనసాగిన ACB సోదాలు (UPDATE)

image

నిజామాబాద్ నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ సెక్షన్‌లో నిన్న <<18329466>>ACB సోదాలు<<>> జరిగిన సంగతి తెలిసిందే. ఈ సోదాలు బుధవారం అర్ధరాత్రి వరకు కొనసాగాయి. టౌన్ ప్లానింగ్‌లో పలువురి సిబ్బందిపై అవినీతి ఆరోపణలు రావడంతో ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ సోదాలను నిర్వహించారు. పోలీసు బందోబస్తు నడుమ ఈ సోదాలు జరిగాయి. పూర్తి వివరాలను త్వరలోనే మీడియాకు వివరిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు.

News November 20, 2025

బస్సెక్కుతుండగా.. రూ.15 లక్షల విలువైన బంగారం చోరీ

image

భీమవరం నుంచి నరసాపురం వెళ్లేందుకు బస్సెక్కుతున్న ఆంజనేయ ప్రసాద్ అనే వ్యక్తి నుంచి రూ.15 లక్షల విలువైన బంగారాన్ని గుర్తుతెలియని దుండగుడు అపహరించాడని సీఐ నాగరాజు వెల్లడించారు. ఈ నెల 17న జరిగిన ఈ ఘటనపై బాధితుడు బుధవారం వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నీలం చొక్కా ధరించిన వ్యక్తి బంగారం ప్యాకెట్‌ను లాక్కుని పరారైనట్లు సీఐ నాగరాజు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.