News April 10, 2024

తాగునీటి ఇబ్బందులు ఉండొద్దు: సీఎస్

image

త్రాగునీటి సరఫరాలో వచ్చే ఇబ్బందులను సత్వరమే పరిష్కరించాలని, ప్రజలకు ఎక్కడా, ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సంద్భంగా హైద్రాబాద్ నుండి రాష్ట్ర స్థాయి ఉన్నత స్థాయి అధికారులతో కలిసి ఆమె వేసవిలో త్రాగునీటి సరఫరాపై ఖమ్మం జిల్లా అధికారులతో వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహించారు. నీటి సమస్యలపై సీఎస్ తెలుసుకున్నారు.

Similar News

News April 21, 2025

ఖమ్మం:ఓపెన్ పరీక్షలు..139గైర్హాజర్

image

ఖమ్మం జిల్లాలో ఓపెన్ స్కూల్ పరీక్షలు ఆదివారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు పదో తరగతి పరీక్షలకు 488 మందికి గాను 420 మంది హాజరు కాగా 68 మంది గైర్హాజరయ్యారు. ఇంటర్మీడియట్ పరీక్షకు 646 మందికి గాను 575 మంది హాజరు కాగా, 71మంది గైర్హాజరయ్యారని డీఈఓ సోమశేఖర శర్మ  తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని పేర్కొన్నారు.

News April 21, 2025

కొత్తగూడెం: యువతికి వేధింపులు.. కేసు నమోదు

image

యువతిని వేధింపులకు గురిచేసిన యువకుడిపై కేసు నమోదైంది. వైరా విప్పలమడుగుకి చెందిన రాహుల్‌ కొత్తగూడెంకు చెందిన యువతితో పరిచయం పెంచుకున్నాడు. ఆ యువతి రాహుల్ వద్ద కొంత డబ్బు అప్పుగా తీసుకుని ఇచ్చేసింది. అయితే డబ్బు పూర్తిగా ఇవ్వలేదని.. దానికి బదులుగా తనతో శారీరకంగా దగ్గర కావాలని వేధిస్తున్నాడు. యువతి పోలీసులను ఆశ్రయించగా కేసు నమెాదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కొత్తగూడెం సీఐ కరుణాకర్ తెలిపారు.

News April 21, 2025

ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు….

image

∆}మధిరలో జాబ్ మేళా∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభం ∆} మధిరలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటన  ∆} వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} వైరా నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన ∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి పర్యటన ∆} పైనంపల్లి శివాలయంలో ప్రత్యేక పూజలు

error: Content is protected !!