News April 16, 2025
తాగునీటి ఇబ్బందులు రాకుండా చర్యలు: కలెక్టర్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తాగు నీటి సరఫరాకు ఇబ్బంది లేకుండా సమ్మక్క సాగర్ బ్యారేజీ నుంచి నీరు విడుదల చేసినట్లు కలెక్టర్ జితేశ్ వి. పాటిల్ తెలిపారు. రానున్న రోజుల్లో జిల్లా వాసులకు తాగు నీటికి ఇబ్బంది రాకుండా ఉండేందుకు నిరంతర పర్యవేక్షణతో మిషన్ భగీరథ, ఇరిగేషన్ అధికారులు సమన్వయం చేసుకోవాలన్నారు. 300 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసినట్లు తెలిపారు.
Similar News
News November 18, 2025
సీనియర్ నేతలను వదులుకొని KCR తప్పు చేశారు: కవిత

సీనియర్ నేతలను వదులుకొని KCR తప్పు చేశారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ మాజీ MP కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. మంగళవారం ఆమె జాగృతి జనం బాటలో భాగంగా మీడియాతో మాట్లాడారు. 20 ఏళ్లు పనిచేసిన తనను కుట్ర చేసి పార్టీ నుంచి, కుటుంబం నుంచి దూరం చేశారని అన్నారు. తనపై ఇంకా నీచస్థాయిలో దాడులు చేస్తున్నారని, అయినా సరే ఎవ్వరికీ బెదిరేదే లేదని కవిత స్పష్టం చేశారు.
News November 18, 2025
సీనియర్ నేతలను వదులుకొని KCR తప్పు చేశారు: కవిత

సీనియర్ నేతలను వదులుకొని KCR తప్పు చేశారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ మాజీ MP కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. మంగళవారం ఆమె జాగృతి జనం బాటలో భాగంగా మీడియాతో మాట్లాడారు. 20 ఏళ్లు పనిచేసిన తనను కుట్ర చేసి పార్టీ నుంచి, కుటుంబం నుంచి దూరం చేశారని అన్నారు. తనపై ఇంకా నీచస్థాయిలో దాడులు చేస్తున్నారని, అయినా సరే ఎవ్వరికీ బెదిరేదే లేదని కవిత స్పష్టం చేశారు.
News November 18, 2025
తెలంగాణలో అతిపెద్ద BESS సౌర ప్రాజెక్టు

TG: బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (BESS)తో 1500 MW సౌర విద్యుత్ ప్లాంట్ రాష్ట్రంలో ఏర్పాటుకానుంది. కేంద్రం ఆమోదించిన అతిపెద్ద ప్రాజెక్ట్ ఇది. మహేశ్వరం, చౌటుప్పల్ ప్రాంతాల్లో TGGENCO ఈ ప్లాంట్లను అభివృద్ధి చేస్తుంది. ఈమేరకు ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి GO విడుదల చేశారు. దీని ద్వారా అందే విద్యుత్ యూనిట్ ధర ₹2.90 మాత్రమే. ఇప్పటికే AP, గుజరాత్, ఛత్తీస్గఢ్ ఈ ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తున్నాయి.


