News February 7, 2025
తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలి: MNCL కలెక్టర్

వేసవి కాలం సమీపిస్తున్నందున మంచిర్యాల జిల్లాలో తాగునీటి ఎద్దడి సమస్య తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో నిరంతరంగా నీటిని అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో తాగునీటి సరఫరా నిర్వహణ చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. మిషన్ భగీరథ పథకంలోని మంచిర్యాల, నస్పూర్ మున్సిపాలిటీల్లో అవసరమైన మేరకు నీటిని అందించాలని సూచించారు.
Similar News
News October 16, 2025
తెనాలి: మహిళతో అసభ్య ప్రవర్తన.. నిందితుడికి జరిమానా

మహిళతో అసభ్యంగా ప్రవర్తించి, లైంగిక వేధింపులకు గురిచేసిన నిందితుడికి రూ. 2 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి పవన్ కుమార్ బుధవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు.. తెనాలి మండలం సోమసుందరపాలెం గ్రామానికి చెందిన మహిళ పట్ల ఆమె బావ వెంకట సుబ్బారావు 2021లో అసభ్యంగా ప్రవర్తించాడు. బాధితురాలి ఫిర్యాదుతో దాఖలైన చార్జ్షీట్పై విచారణ అనంతరం న్యాయమూర్తి ఈ మేరకు బుధవారం తీర్పు ఇచ్చారు.
News October 16, 2025
జనవరిలో 2వేల DSC పోస్టులకు నోటిఫికేషన్!

AP: మంత్రి లోకేశ్ హామీ మేరకు JAN-2026లో DSC నోటిఫికేషన్ విడుదలకు విద్యాశాఖ సన్నద్ధం అవుతోంది. త్వరలోనే టెట్ నిర్వహణకు ప్లాన్ చేస్తోంది. ఈసారి సుమారు 2వేల పోస్టుల వరకు భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. స్పెషల్ DSC, మెగా DSCలో మిగిలిన 406 పోస్టులతో సహా రిటైర్ అయ్యే టీచర్ల ఖాళీలతో కలుపుకొని నోటిఫికేషన్ ఉండనుంది. అభ్యర్థుల అర్హతలు, డిగ్రీ మార్కులు తదితర అంశాల్లో NCTE నిబంధనలు అమలు చేయనున్నారు.
News October 16, 2025
కర్నూలు సిద్ధం… వెల్కమ్ మోదీ జీ!

ప్రధాని మోదీకి కర్నూలు ప్రజలు స్వాగతం పలుకుతున్నారు. కాసేపట్లో ప్రత్యేక విమానంలో బయలుదేరనున్న ఆయన ఉ.10.20కి ఓర్వకల్లుకు చేరుకుంటారు. అనంతరం ఎంఐ-17 హెలికాప్టర్లో వెళ్లి శ్రీశైల మల్లన్నను దర్శించుకుంటున్నారు. మ.2.20కి కర్నూలులో జరిగి ‘జీఎస్టీ 2.0’ సభలో పాల్గొని రూ.13,400 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. మోదీకి <<18016530>>స్వాగతం<<>> పలుకుతూ కర్నూలులో భారీ ఫ్లెక్సీలు వెలిశాయి.