News July 17, 2024
తాగునీటి సమస్యకు అత్యంత ప్రాధాన్యత: ప్రకాశం కలెక్టర్

జిల్లాలో తాగునీటి సమస్య పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం ఆమె సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా సాగు, తాగునీటికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ముందస్తుగా చర్యలు చేపట్టాలన్నారు. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాలలో తాగునీటి సమస్యలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
Similar News
News November 27, 2025
ప్రకాశం: విద్యార్థుల పట్ల టీచర్ అసభ్య ప్రవర్తన.. చివరికి సస్పెండ్!

ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం నిడమనూరు ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న వినయ్ను సస్పెండ్ చేసినట్లు DEO కిరణ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు గురువారం సాయంత్రం ప్రకటన విడుదల చేశారు. బాలికల పట్ల <<18401027>>అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు<<>> వచ్చిన అభియోగంపై <<18404073>>విచారణ<<>> జరిపామన్నారు. విచారణలో తేలిన అంశాల ఆధారంగా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు.
News November 27, 2025
ప్రకాశం: ఫ్రీ ట్రైనింగ్తో జాబ్.. డోంట్ మిస్.!

ఒంగోలులోని ప్రభుత్వ ఐటీఐ బాలికల కళాశాలలో ఎలక్ట్రిక్ వెహికల్ సర్వీస్ టెక్నీషియన్, ఫోర్ వీలర్ సర్వీస్ టెక్నీషియన్ కోర్సులను ఉచితంగా అందిస్తున్నట్లు స్కిల్ డెవలప్మెంట్ అధికారి రవితేజ తెలిపారు. ఒంగోలులోని తన కార్యాలయంలో గురువారం మాట్లాడుతూ.. స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో 3 నెలలు ఉచిత శిక్షణ అందిస్తామని, ఆ తర్వాత ఉపాధి అవకాశాలను కల్పిస్తామన్నారు. ఆసక్తిగలవారు ఈనెల 28లోగా కళాశాలను సంప్రదించాలన్నారు.
News November 27, 2025
ఉపాధ్యాయుడిపై విచారణకు త్రి మెన్ కమిటీ నియామకం

నాగులుప్పలపాడు మండలం బి నిడమనూరు కళాశాలకు చెందిన తెలుగు ఉపాధ్యాయుడు వినయ్పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో త్రి మెన్ విచారణ కమిటీని నియమించినట్లు డీఈఓ కిరణ్ కుమార్ తెలిపారు. విద్యార్థినుల పట్ల ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించాడన్న కారణంగా గ్రామస్థులు దేహశుద్ధి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై డిప్యూటీ డీఈఓ ఆధ్వర్యంలో విచారణ నిర్వహించి, తగిన చర్యలు తీసుకుంటామన్నారు.


