News February 12, 2026
తాగునీటి సమస్యనా? ఫోన్ చేయండి

అనంతపురం జిల్లాలో తాగునీటి సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు డీపీఓ నాగరాజ నాయుడు తెలిపారు. నీటి సరఫరాలో ఇబ్బందులు ఎదురైతే ప్రజలు 9701745437 నంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని అన్నారు. అందిన సమస్యలను తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జిల్లా ప్రజలు ఈ సేవలను వినియోగించుకోవాలని కోరారు.
Similar News
News March 13, 2026
HYD: ప్రభుత్వ ఆస్పత్రులకు మందుల సప్లై బంద్!

నగరంలో ప్రభుత్వ ఆస్పత్రులకు సరఫరా చేసిన మందుల బిల్లులు దాదాపు రూ.80 కోట్ల వరకు చెల్లించాల్సి ఉందని ట్విన్ సిటీస్ హాస్పిటల్స్ సప్లయర్స్ అసోసియేషన్ సభ్యులు ఆరోపిస్తున్నారు. పెండింగ్ బిల్లులు ఇంకా క్లియర్ కాకపోవడంతో తాము ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు. వెంటనే తమ బిల్లులు చెల్లించకపోతే మందుల సరఫరా పూర్తిగా నిలిపేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.
News March 13, 2026
NLG: గ్యాస్ ‘గందరగోళం’.. సర్వర్లు డౌన్

జిల్లాలో సామాన్యుడి వంట గదిలో గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. సిలిండర్ల కొరత ఏర్పడుతుందన్న భయంతో వినియోగదారులు ఒక్కసారిగా రీఫిల్లింగ్ కోసం ఎగబడుతుండటంతో బుకింగ్ నెట్వర్క్ పూర్తిగా కుప్పకూలింది. వినియోగదారులు గ్యాస్ రీఫిల్ కోసం ఆశ్రయించే డిజిటల్ మార్గాలు ప్రస్తుతం చేతులెత్తేశాయి. వేల సంఖ్యలో వినియోగదారులు ఏకకాలంలో ప్రయత్నిస్తుండటంతో మిస్డ్ కాల్, IVRS వ్యవస్థలు పనిచేయడం లేదని డిస్ట్రిబ్యూటర్లు తెలిపారు.
News March 13, 2026
గాలి నుంచి నీరు.. తిరుపతి IIT విద్యార్థుల ప్రయోగం

గాలిని తీసుకుని అందులోని తేమను స్వీకరించి స్వచ్ఛమైన నీటిగా మార్చే యంత్రాన్ని తిరుపతి ఐఐటీ విద్యార్థులు రూపొందించారు. ‘ఎయిర్ టూ వాటర్’ అనే కాన్సెప్ట్తో దీన్ని తిరుపతిలోని రీజినల్ సైన్స్ సెంటర్లో అందుబాటులో ఉంచారు. గాలి నుంచి నీటిని సేకరించే బీటిల్స్, ఎడారిలో నివసించే కాక్టస్ మొక్కల నుంచి ప్రేరణతో దీనిని తయారుచేశారు. ఓ తమిళ సూపర్ స్టార్ వీటిని తనకు కావాలని ఆర్డర్ పెట్టించుకున్నట్లు సమాచారం.


