News March 17, 2025
తాగునీటి సమస్యపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్

శ్రీ సత్య సాయి జిల్లాలో ఎక్కడ తాగునీటి సమస్యలు లేకుండా చూడాలని, ఆర్డీవోలు నీటి సమస్యపై నిరంతరం పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ టిఎస్ చేతన్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయం నుంచి తాగునీరు, వడగాల్పులు, పి-4 సర్వే, రీ సర్వే, పీజీఆర్ఎస్ అంశాలపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వడగాల్పులు ఎక్కువగా ఉంటాయని విపత్తుల శాఖ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకొని నీటి సమస్య తలెత్తే ప్రాంతాలను గుర్తించాలన్నారు.
Similar News
News January 1, 2026
నావల్ డాక్యార్డ్లో 320 పోస్టులు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

విశాఖపట్నంలోని నావల్ డాక్యార్డ్లో 320 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. టెన్త్, ITI అర్హతగల వారు NAPS పోర్టల్లో అప్లై చేసుకోవచ్చు. షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష, మెరిట్ లిస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్(DV) ద్వారా ఎంపిక చేస్తారు. MARCH 22న రాత పరీక్ష నిర్వహించి, 25న ఫలితాలు వెల్లడిస్తారు. DV మార్చి 30న, మెడికల్ టెస్ట్ మార్చి 31 న నిర్వహిస్తారు. https://indiannavy.gov.in
News January 1, 2026
తిరుమలలో టోకెన్లు లేకపోయినా రూములు

తిరుమలలో 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు సర్వదర్శనానికి భక్తులను అనుమతించనున్నారు. గదుల కేటాయింపులో 7రోజుల పాటు స్వల్ప మార్పులు చేశారు. గతంలో ఎంబీసీ, టీబీసీ, పద్మావతి విచారణ కార్యాలయంలో టోకెన్లు కలిగిన భక్తులకు గదులు కేటాయిస్తున్నారు. తాజాగా సర్వదర్శనం కోసం వచ్చే భక్తులకు ఆధార్ కార్డు ద్వారా సీఆర్వో కార్యాలయం వద్ద గదులు కేటాయించనున్నారు.
Share It.
News January 1, 2026
చందన్వెల్లి చౌరస్తా.. ప్రపంచపు డిజిటల్ గల్లా పెట్టె!

వాట్సాప్ స్టేటస్ పెట్టినా, నెట్ఫ్లిక్స్లో మూవీ చూసినా ఆ డేటా వచ్చి చేరే ‘ప్రపంచపు డిజిటల్ లాకర్’ మన చేవెళ్లలో ఉంది. చందన్వెల్లి-షాబాద్ బెల్ట్ ఇప్పుడు అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి టెక్ దిగ్గజాలకు అడ్డా. గ్లోబల్ కంపెనీలు ₹లక్షల కోట్లు కుమ్మరిస్తున్నాయి. RRR కనెక్టివిటీ తోడైతే ఇండియాకే ‘డిజిటల్ పవర్ హౌస్’ కానుంది. పొలాలకు C/O అడ్రసైన ప్రాంతం, ఇప్పుడు ప్రపంచపు డేటాకు సెక్యూరిటీ గార్డ్లా మారుతోంది.


