News March 17, 2025
తాగునీటి సమస్యపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్

శ్రీ సత్య సాయి జిల్లాలో ఎక్కడ తాగునీటి సమస్యలు లేకుండా చూడాలని, ఆర్డీవోలు నీటి సమస్యపై నిరంతరం పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ టిఎస్ చేతన్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయం నుంచి తాగునీరు, వడగాల్పులు, పి-4 సర్వే, రీ సర్వే, పీజీఆర్ఎస్ అంశాలపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వడగాల్పులు ఎక్కువగా ఉంటాయని విపత్తుల శాఖ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకొని నీటి సమస్య తలెత్తే ప్రాంతాలను గుర్తించాలన్నారు.
Similar News
News October 17, 2025
జగిత్యాల: సన్న/దొడ్డు రకం ధాన్యానికి వేర్వేరు కేంద్రాలు

జగిత్యాల కలెక్టరేట్లో ధాన్యం కొనుగోలుపై జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ సమావేశం నిర్వహించారు. లోతట్టు ప్రాంతాల్లో కొత్త కేంద్రాలు ప్రారంభించవద్దని, ప్రతి కేంద్రంలో అవసరమైన వస్తువులు సిద్ధం చేయాలని సూచించారు. సన్న రకం, దొడ్డు రకం ధాన్యానికి వేర్వేరు కేంద్రాలు, ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి రవాణాను వేర్వేరు నిర్వహించి రైతులకు స్పష్టత కల్పించాలని అన్నారు.
News October 17, 2025
జగిత్యాలలో శిశు మరణాలపై సమీక్ష

జగిత్యాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ కే. ప్రమోద్ కుమార్ ఆధ్వర్యంలో చైల్డ్ డెత్ రివ్యూ సమీక్ష సమావేశం జరిగింది. ఏప్రిల్ 1 నుంచి ఇప్పటివరకు జరిగిన 40లో 10 శిశు మరణాలపై ఆడిట్ నిర్వహించారు. ఎక్కువగా ప్రీ టర్మ్ డెలివరీలు, హార్ట్ డిసీజెస్, ఆస్పిరేషనల్ కేసుల వల్ల మరణాలు జరిగాయని తెలిపారు. మరణాలపై తల్లులు, ఆశ, మహిళా ఆరోగ్య కార్యకర్తలకు పలు సూచనలు చేశారు.
News October 17, 2025
అనుమతులు లేకుండా బాణసంచా విక్రయిస్తే చర్యలు: శ్రీకాకుళం కలెక్టర్

అనుమతులు లేకుండా బాణసంచా విక్రయించినా, తయారు చేసినా కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ హెచ్చరించారు. శుక్రవారం శ్రీకాకుళం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. అధికారులు గ్రామస్థాయిలో సైతం తనిఖీలు నిర్వహించాలన్నారు. బాణసంచా విక్రయాల కోసం అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేశారు. హోల్సేల్ షాపులను పోలీస్, ఫైర్, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా తనిఖీ చేయాలన్నారు.