News March 3, 2025

తాగునీటి సమస్య రాకుండా చర్యలు: కలెక్టర్

image

కోనసీమ జిల్లాలో వేసవిలో తాగునీటి సమస్య ఉత్పన్నం కాకుండా ప్రత్యేక చొరవ తీసుకోవాలని కలెక్టర్ మహేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం అమలాపురంలో తాగునీటి సరఫరా ఇంజినీర్లు, మున్సిపల్ కమిషనర్లతో సమావేశం నిర్వహించారు. తాగునీటి ప్రాజెక్టుల మరమ్మతులు చేపట్టి వాటిని పూర్తి చేయాలన్నారు. నదీతీరంలోని తాగునీటి ఏర్పాట్లు, బోరు బావుల మరమ్మతులు, వేసవి స్టోరేజ్ ట్యాంకులు నింపడం, వేసవి కార్యాచరణపై సమీక్షించారు.

Similar News

News December 10, 2025

రంప: డిప్యూటీ డైరెక్టర్‌కు షోకాజ్ నోటీసు?

image

రంపచోడవరం గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రుక్మాంగదయ్యకు ITDA పీవో స్మరణ్ రాజ్ షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు తెలుస్తోంది. గోకవరం పోస్ట్ మెట్రిక్ బాలుర వసతి గృహం వార్డెన్‌గా పని చేస్తున్న సంబుడును పీఓ అనుమతి లేకుండా రంపచోడవరం సహాయ గిరిజన సంక్షేమాధికారిగా నియమించినందుకుగాను నోటీసు జారీ చేసినట్లు సమాచారం. ఎస్టీ కమిషన్ చైర్మన్ బొజ్జిరెడ్డి ITDA POకు ఫిర్యాదు చేయడంతో నోటీసు అందజేశారని తెలిసింది.

News December 10, 2025

తిరుపతి: పరీక్ష ఫీజు చెల్లించేందుకు అవకాశం.!

image

అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ(BRAOU) పరిధిలో M.B.A, M.LI.Sc విద్యార్థులు PG మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులు పరీక్షా ఫీజు చెల్లించాలని తిరుపతి ప్రాంతీయ కార్యాలయ కో-ఆర్డినేటర్ మల్లికార్జునరావు పేర్కొన్నారు. పరీక్ష ఫీజు చెల్లించడానికి డిసెంబర్ 22 చివరి తేదీ అని చెప్పారు. మరిన్ని వివరాలకు www.braouonline.in వెబ్‌సైట్ చూడాలని సూచించారు.

News December 10, 2025

గన్నవరం: ఇసుక కుప్ప కాదండి.. రంగు మారిన ధాన్యం..!

image

పై ఫోటోలో మీకు కనిపిస్తున్నది ఇసుక కుప్ప అనుకుంటున్నారు కదూ. కానే కాదు.. అది రంగు మారిన ధాన్యం రాశి. గత మొంథా తుఫాను వరదలో నానిన వరి చేను నూర్చారు. గన్నవరం మండలం పురుషోత్తపట్నం గ్రామంలో ఇలా రంగు మారిన ధాన్యం రాశులు చూడొచ్చు. రైతులు 75 కిలోల బస్తా రూ.1300 చొప్పున వ్యాపారికి బుధవారం విక్రయించారు. ఈ విధంగా బస్తాకు వెయ్యి రూపాయలు చొప్పున రైతులకు నష్టాలు మిగిల్చింది తుఫాను.