News March 20, 2025

తాగునీటి సరఫరాకు ప్రణాళికను అమలు చేయాలి: కలెక్టర్

image

క్షేత్రస్థాయిలో తాగునీటి సరఫరాకు రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో ఎంపీడీవోలు, తహసీల్దార్లు, తదితర అధికారులతో ఇందిరమ్మ ఇళ్లు, మిషన్ భగీరథ, తాగు నీరు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. వడదెబ్బ తగలకుండా తగిన రక్షణ చర్యలు తీసుకోవాలనే అంశంపై విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టాలన్నారు.

Similar News

News March 31, 2025

అచ్యుతాపురం చేరుకున్న మంత్రి లోకేశ్

image

అచ్యుతాపురం-అనకాపల్లి రహదారి విస్తరణ పనులకు సోమవారం మధ్యాహ్నం అచ్యుతాపురం చేరుకున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌కు స్వాగతం లభించింది. మాజీ ఎంపీ పప్పల చలపతిరావు, రాష్ట్ర రహదారుల కార్పొరేషన్ ఛైర్మన్ ప్రగడ నాగేశ్వరావు, జిల్లా పార్టీ అధ్యక్షుడు బత్తుల తాతయ్య బాబు, ప్రధాన కార్యదర్శి లాలం కాశీనాయుడు పుష్ప గుచ్చాలు అందజేసి ఘనంగా స్వాగతం పలికారు.

News March 31, 2025

సిరిసిల్ల: కుటుంబ సభ్యుల పాత్ర కీలకం: కమాండెంట్

image

ఉద్యోగ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించడంలో కుటుంబసభ్యుల బాధ్యత చాలా కీలకమని సిరిసిల్ల బెటాలియన్ కమాండెంట్ సురేష్ అన్నారు. సిరిసిల్ల పట్టణ పరిధి పెద్దూరులోని బెటాలియన్‌లో ఆర్ఎస్ఐ వై నారాయణ ఉద్యోగ విరమణ పొందిన సందర్భంగా ఆయన మాట్లాడారు. కర్తవ్య నిర్వహణ కోసం తమ సుఖసంతోషాలను త్యాగంచేసి శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు అంకితం అవుతారని స్పష్టంచేశారు. ఉద్యోగవిరమణ అనంతరం కుటుంబసభ్యులతో ఆనందంగా గడపాలన్నారు.

News March 31, 2025

నిర్మాత ముళ్లపూడి కన్నుమూత

image

టాలీవుడ్ నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం(68) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో మరణించారు. ఆస్ట్రేలియాలో ఉన్న కుమారుడు వచ్చాక బుధవారం కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈయన దివంగత ఈవీవీ సత్యనారాయణకు దగ్గరి బంధువు. నేను, అల్లుడుగారు వచ్చారు, మనోహరం, ఓ చిన్నదానా లాంటి సినిమాలను ముళ్లపూడి నిర్మించారు.

error: Content is protected !!