News July 6, 2024
తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి నిలపాలి: కలెక్టర్ అన్సారియా

తాగునీటి సరఫరాలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రత్యేక దృష్టి నిలపాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. శుక్రవారం ప్రకాశం భవనంలోని కలెక్టర్ ఛాంబర్లో ఒంగోలు కార్పొరేషన్తో సహా అన్ని మున్సిపాలిటీలు, నగర పంచాయతీల కమిషనర్లతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. మున్సిపాలిటీలలో ఇళ్లకు సరఫరా చేస్తున్న తాగునీటి సరఫరా వివరాలను కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
Similar News
News February 11, 2025
చీమకుర్తి: తండ్రిపై కొడుకు గొడ్డలితో దాడి

ప్రకాశం జిల్లాలో మంగళవారం సాయంత్రం దారుణం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చీమకుర్తి మండలం బండ్లమూడుకి చెందిన లక్ష్మారెడ్డిపై కొడుకే గొడ్డలితో దాడి చేసినట్లు సమాచారం. వెంటనే గ్రామస్థులు అడ్డుకొని 108 వాహనంలో క్షతగాత్రుణ్ణి ఒంగోలు హాస్పిటల్కు తరలించారు. తండ్రిపై దాడి చేసిన కుమారున్ని చీమకుర్తి పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
News February 11, 2025
ఉపాధి పనులలో పురోగతి ఉండాలి: కలెక్టర్

ఉపాధి హామీ పనులలో ప్రతివారం స్పష్టమైన పురోగతి కనిపించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. కలెక్టరేట్లో సోమవారం మండల స్థాయి అధికారులతో అభివృద్ధి కార్యక్రమాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉపాధి కూలీల మొబిలైజేషన్, సగటు వేతనం పెంపుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. ఎంఎస్ఎంఈ సర్వేలో రోజువారి లక్ష్యాలను నిర్దేశించుకుని పకడ్బందీగా నిర్వహించాలన్నారు.
News February 10, 2025
ప్రకాశం: తండ్రిని చంపిన కొడుకు.. BIG UPDATE

దొనకొండ(M) ఇండ్లచెరువులో <<15406169>>తండ్రిని కొడుకు హత్య<<>> చేసిన విషయం తెలిసిందే. వివరాల్లోకి వెళ్తే.. మద్యానికి బానిసైన మరియదాసు రోజూ ఇంట్లో గొడవ పడేవాడు. వారం కిందట భార్య, పిల్లలతో పుట్టింటికి వెళ్లింది. శనివారం తండ్రి వద్ద డబ్బులు తీసుకుని మరియదాసు తాగి రోడ్డుపై పడిపోయాడు. విషయం తెలుసుకున్న తండ్రి ఏసు ఇంటికి తెచ్చాడు. అర్ధరాత్రి మెలుకువ వచ్చి రంపం బ్లేడుతో నిద్రలో ఉన్న తండ్రిని హత్యచేశాడు.