News February 12, 2025

తాగునీరు, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి: కలెక్టర్

image

గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి, పారిశుద్ధ్య సమస్యలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని నంద్యాల కలెక్టర్ రాజకుమారి సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లో జిల్లా, డివిజన్ అధికారులతో ప్రత్యేక కాన్ఫరెన్స్ నిర్వహించారు. తాగునీటి సమస్యలను ముందస్తు ప్రణాళికలతో గుర్తించి, వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. పారిశుద్ధ్యంపై నిత్యం పర్యవేక్షణ ఉండాలని అన్నారు.

Similar News

News February 13, 2025

MDK: తమ్ముడిని చంపిన అన్నకు జీవిత ఖైదు

image

హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ సంగారెడ్డి న్యాయస్థానం తీర్పునిచ్చింది. వివరాలు.. రామచంద్రపురం బాంబే కాలనీకి చెందిన మహమ్మద్ ఇబ్రహీం(27) కుటుంబ తగాదాల కారణంగా తన సొంత తమ్ముడైన ఎండీ లతీఫ్(24)ను 2020, జనవరి 17న రాత్రి నిద్రపోతున్న సమయంలో గొడ్డలితో నరికి చంపాడు. స్నేహితుడు అశోక్ సహాయంతో నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లి డెడ్ బాడీని తగలబెట్టారు. ఈ కేసులో నిందితుడికి తాజాగా శిక్ష పడింది.

News February 13, 2025

చండ్రుగొండ : కేజీబీవీలో బాలికలపై ఎలుకల దాడి

image

చండ్రుగొండలోని కేజీబీవీ బాలికల వసతి గృహంలో విద్యార్థులపై ఎలుకలు దాడి చేసి గాయపరిచాయి. ఎంఈవో సత్యనారాయణ వివరాల ప్రకారం.. పడుకొని ఉన్న  ఇద్దరు బాలికలపై ఎలుకలు దాడి చేసి స్వల్పంగా గాయపరిచాయని చెప్పారు. వసతి గృహాన్ని సందర్శించి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయంపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

News February 13, 2025

బీసీల నుంచి ముస్లింలను తొలగించాలి.. బండి డిమాండ్

image

TG: రిజర్వేషన్ల అంశంలో బీసీ కేటగిరీ నుంచి ముస్లింలను తొలగించాలని కేంద్రమంత్రి బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదంటే హిందూ సమాజం నుంచి తిరుగుబాటు తప్పదని, MLC ఎన్నికల్లో INC మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మతాల ఆధారంగా రిజర్వేషన్లకు BJP వ్యతిరేకమని స్పష్టం చేశారు. BC రిజర్వేషన్ల వ్యవహారాన్ని INC ప్రభుత్వం కేంద్రంపై నెట్టడానికి చూస్తోందని మండిపడ్డారు.

error: Content is protected !!