News April 24, 2024

తాడికొండ కాంగ్రెస్ అభ్యర్థి మార్పు.. పలువురి పేర్లు ప్రకటన

image

ఏపీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లాలో పోటీ చేసే అభ్యర్థుల వివరాలు వెల్లడించింది. తాడికొండ(ఎస్సీ) నియోజకవర్గానికి చిలకా విజయ్ కుమార్ స్థానంలో మణిచల సుశీల్ రాజా పేరును ఖరారు చేసింది. రేపల్లె- మోపిదేవి శ్రీనివాసరావు, తెనాలి – ఎస్కే బషీద్ , గుంటూరు వెస్ట్ నియోజకవర్గానికి డాక్టర్. రాచకొండ జాన్ బాబు పేర్లను అధిష్ఠానం ప్రకటించింది.

Similar News

News February 9, 2026

స్వల్ప వృద్ధితోనే గుంటూరు జిల్లా ఆదాయ వసూళ్లు

image

గుంటూరు జిల్లా మున్సిపల్ ఆదాయ వసూళ్లలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. 2025–26 ఆర్థిక సంవత్సరంలో జిల్లా మొత్తం వసూలు చేయాల్సింది ₹452.15 కోట్లుగా నమోదైంది. ఫిబ్రవరి 9 వరకు వసులుచేసింది ₹152.35 కోట్లు మాత్రమే అది 33.70%గా ఉంది. గత ఏడాది ఇదే కాలంలో ₹152.29 కోట్లు వసూలు కాగా, ఈ ఏడాది స్వల్పంగా 3.90% వృద్ధి నమోదైంది. లక్ష్య సాధనలో ఇంకా వేగం పెంచాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది.

News February 8, 2026

GNT: వెహికల్ చెకింగ్.. రూ.5లక్షల జరిమానా, 72 సీజ్

image

గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఆదివారం సాయంత్రం పోలీసులు రహదారి భద్రతా డ్రైవ్ చేపట్టారు. మొత్తం 2,436 వాహనాలను ప్రధాన కూడళ్లల్లో తనిఖీ చేశారు. త్రిపుల్ రైడింగ్, అతివేగం, హెల్మెట్ లేకుండా ప్రయాణం‌, మైనర్ల డ్రైవింగ్‌ని గుర్తించి
933 వాహనాలపై కేసులు నమోదు చేశారు. నిబంధనలు అతిక్రమించిన వాహనాలకు రూ.5,67,590 జరిమానా విధించారు. ధృవపత్రాలు సక్రమంగా లేని 72 వాహనాలను సీజ్ చేశారు.

News February 8, 2026

GNT: రేపు ఎస్పీ ఆఫీసులో PGRS రద్దు

image

గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నాటి పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర సచివాలయం నుంచి వర్చువల్ విధానంలో మంత్రులు, కార్యదర్శులతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొనాల్సి ఉంటుందని, ఈ నేపథ్యంలో పీజీఆర్ఎస్‌ను రద్దు చేశామని చెప్పారు. ప్రజలు గమనించాలని చెప్పారు.