News April 5, 2025
తాడిపత్రిలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య UPDATE

తాడిపత్రిలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డ విషయం తెలిసిందే. హర్షత్ విజయవాడలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేశాడు. 2 ఇయర్ క్లాసులకు కాలేజీకి రావాలని కాల్ వచ్చింది. కుమారుడు వెళ్లననడంతో తల్లి మందలించి పంపింది. కాలేజీకి వెళ్లకుండా మళ్లీ ఇంటికి వచ్చాడు. తల్లి ఏం అనకుండా కూలీ పనులకు వెళ్లింది. మధ్యాహ్నం ఇంటికి వచ్చి చూడగా <<15994650>>ఉరి వేసుకుని<<>> కనిపించాడు. ఇతని తండ్రి దక్షిణాఫ్రికాలో పనిచేస్తున్నారు.
Similar News
News April 20, 2025
వచ్చే సంక్రాంతికి అఖండ-2?

బోయపాటి శ్రీను డైరెక్షన్లో బాలకృష్ణ నటిస్తున్న అఖండ-2 మూవీ విడుదల వాయిదా పడనున్నట్లు సమాచారం. తొలుత ఈ ఏడాది సెప్టెంబర్ 25కి ప్లాన్ చేయగా ఆలోపు సినిమా షూటింగ్, VFX వర్క్స్ పూర్తయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. దీంతో వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలపాలని మేకర్స్ యోచిస్తున్నట్లు టాక్. కాగా బాలయ్య- బోయపాటి మధ్య అభిప్రాయభేదాలు వచ్చాయనే వార్తలను సినీ వర్గాలు <<16051406>>ఖండించిన<<>> విషయం తెలిసిందే.
News April 20, 2025
NLG: ప్రతి మూడో ఆదివారం.. బుద్ధవనం టూర్!

టూరిజం శాఖ సహకారంతో ప్రతిమ ట్రావెల్స్ ఆధ్వర్యంలో HYD నుంచి నాగార్జునసాగర్కు ప్రతి నెలా మూడో ఆదివారం ప్రత్యేకంగా పర్యాటకులకు నాగార్జునసాగర్ టూర్ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నట్లు బుద్ధవనం నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 6 గంటలకు HYD నుంచి బయల్దేరి నాగార్జునసాగర్ చేరుకొని బుద్ధవనం, నాగార్జునకొండలను సందర్శించిన అనంతరం రాత్రి 9 గంటల వరకు HYDకు పర్యాటకులను చేర్చుతారని తెలిపారు
News April 20, 2025
జూరాల నుంచి నీటిని విడుదల చేయలేం: వనపర్తి కలెక్టర్

మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి పాల్గొన్నారు. జూరాల ప్రాజెక్టు గురించి కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రాజెక్టులో నీటి నిల్వలు తగ్గిపోయినందున, తాగునీటి అవసరాలకు తప్ప సాగుకు ప్రస్తుతం నీటిని విడుదల చేయలేమని అన్నారు. కర్ణాటక రాష్ట్రంతో మాట్లాడి జూరాలకు కొంత నీటిని విడుదల చేసే విధంగా చూడాలని మంత్రిని కలెక్టర్ కోరారు.