News March 21, 2024

తాడిపత్రిలో ఉరివేసుకుని మహిళ ఆత్మహత్య

image

తాడిపత్రిలో విషాదం చోటుచేసుకుంది. పట్టణ పరిధిలోని జయనగర్ కాలనీకి చెందిన రమాదేవి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు వెంటనే తాడిపత్రి పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Similar News

News February 15, 2025

వికసిత్ భారత్ లక్ష్యంగా ఎన్డీఏ ముందుకు: మంత్రి

image

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై అనంతపురంలో మేధావులతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. 2047 నాటికి వికసిత్​ భారత్ లక్ష్యంగా ప్రధాని మోదీ సారథ్యంలో ఎన్డీయే ప్రభుత్వం బడ్జెట్​లో కేటాయింపులు చేసిందన్నారు. వ్యవసాయం, విద్య, వైద్యం, రక్షణ, మౌలిక సదుపాయాల కల్పనను సమన్వయం చేసుకుంటూ సంస్కరణలు తీసుకురావడానికి కృషి చేస్తున్నారని తెలిపారు.

News February 15, 2025

జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదు

image

తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. సినీ నటి మాధవీలత ఇచ్చిన ఫిర్యాదుతో ఆయనపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. జేసీ తనను కించపరిచేలా మాట్లాడారని, ఆయన అనుచరులు, అభిమానులు తనను చంపుతామని బెదిరిస్తున్నారంటూ ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.

News February 15, 2025

యాడికి మండల లారీ డ్రైవర్ దుర్మరణం

image

యాడికి మండలం కుర్మాజీపేటకు చెందిన లారీ డ్రైవర్ రాజు మృతిచెందారు. స్థానికుల వివరాల మేరకు.. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల సమీపంలో ఓ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద మట్టి లోడ్ చేస్తున్న సమయంలో రాజు ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందాడు. లారీపై నుంచి కింద పడిన వెంటనే స్థానికులు గమనించి పిడుగురాళ్ల ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

error: Content is protected !!