News February 4, 2025
తాడిపత్రిలో ప్రజాస్వామ్యం ఖూనీ అయింది: పెద్దారెడ్డి

తనను తాడిపత్రికి వెళ్లకుండా పోలీసులు అడ్డకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. లా అండ్ ఆర్డర్ సమస్య అంటూ తనను వెళ్లనివ్వట్లేదని తెలిపారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో మాజీ ఎమ్మెల్యేలను సొంత నియోజకవర్గంలోకి వెళ్లకుండా ఎక్కడా అడ్డుకోవడం లేదని తెలిపారు. జేసీ కారణంగా తాడిపత్రిలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోయిందని విమర్శించారు.
Similar News
News February 10, 2025
టీచర్ MLC అభ్యర్థిగా మల్లారెడ్డి నామినేషన్ దాఖలు

సిద్దిపేటకు చెందిన జగ్గు మల్లారెడ్డి టీచర్ MLC అభ్యర్థిగా సోమవారం కరీంనగర్ కలెక్టరేట్లో నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మల్లారెడ్డి మాట్లాడుతూ.. ఈనెల 27న ఎమ్మెల్సీ పోలింగ్ ఉన్నందున తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. తనకు మద్దతిచ్చి గెలిపిస్తే చట్టసభల్లో తన గొంతు వినిపిస్తానన్నారు. రాష్ట్రంలో టీచర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానన్నారు.
News February 10, 2025
పకడ్బందీగా పరీక్షల నిర్వహణ: డిఐఈఓ

సిద్దిపేట జిల్లాలో కొనసాగుతున్న ఇంటర్మీడియట్ ప్రయోగ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి, జిల్లా ఇంటర్మీడియట్ పరీక్షల కమిటీ కన్వీనర్ కే రవీందర్ రెడ్డి అన్నారు. సోమవారం దుబ్బాక మండల కేంద్రంలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షా కేంద్రాలను సందర్శించారు. ఈనెల 3 నుంచి 22 వరకు ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు కొనసాగుతున్నాయన్నారు.
News February 10, 2025
హరీశ్ రావు లేఖకు కేంద్ర మంత్రి స్పందన

సిద్దిపేట-ఎల్కతుర్తి జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా నంగునూరు మండలం రాజగోపాల్ పేట గ్రామంలో సెంట్రల్ లైటింగ్, ఫుట్ పాత్, డ్రైనేజీ ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కారికి మాజీ మంత్రి, MLA హరీశ్ రావు ఇటీవల లేఖ రాశారు. దీనిపై స్పందించిన గడ్కారీ తిరిగి లేఖ రాస్తూ జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా మీరు కోరిన పనుల ఏర్పాటుకు అధికారులకు తగిన ఆదేశాలు ఇచ్చామన్నారు. దీంతో హరీశ్ రావు ధన్యవాదాలు తెలిపారు.