News February 13, 2025
తాడిపత్రిలో శివలింగం కింద నీటిని చూశారా!

అనంతపురం జిల్లాలో దక్షిణ కాశీగా పిలవబడుతూ తాడిపత్రిలోని పెన్నా నది ఒడ్డున వెలసిన శ్రీ బుగ్గ రామలింగేశ్వరస్వామి క్షేత్రానికి ఓ విశిష్టత ఉంది. వర్షాలు లేకపోయినా, నీటి వనరులు ఎండిపోయినా ఇక్కడ శివలింగం కింద నీరు ఊరుతూనే ఉంటుంది. అయితే అలంకరణలో ఉన్న సమయంలో దర్శనానికి వెళ్లే భక్తులకు ఆ దృశ్యాన్ని చూసే భాగ్యం కలగదు. పై ఫొటోలో శివలింగం కింద నీటిని స్పష్టంగా చూడొచ్చు.
Similar News
News December 9, 2025
ధాన్యం సేకరణ వేగవంతంగా జరుగుతుంది: కలెక్టర్

జిల్లాలో ధాన్యం కొనుగోలు వేగవంతంగా జరుగుతుందని, ఇప్పటివరకు 2.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 37 వేల మంది రైతులు నుంచి కొనుగోలు చేసినట్లు జేసీ రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. ధాన్యాన్ని కొనుగోలు చేసిన 24 గంటల్లోపుగా రూ.483.27 కోట్లు, 48 గంటల లోపుగా రూ.18.84 కోట్ల నగదు రైతుల ఖాతాల్లో జమయ్యాయని తెలిపారు. రైతులకు ఇబ్బంది లేకుండా 90 వేల గన్నీ బ్యాగులను రైతు సేవా కేంద్రంలో అందుబాటులో ఉంచామన్నారు.
News December 9, 2025
ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలే లక్ష్యం: కామారెడ్డి SP

ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని KMR ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, నలుగురికి మించి గుమిగూడడం నిషేధమని తెలిపారు. చెక్పోస్టులు, FST, SST బృందాల ద్వారా నిరంతర తనిఖీలు కొనసాగుతున్నాయి. 33 క్రిటికల్/సెన్సిటివ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉందన్నారు. ప్రజలు ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని కోరారు.
News December 9, 2025
మెదక్: ఎన్నికల రోజు స్థానిక సెలవు

జిల్లాలో మూడు విడతలుగా జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్బంగా ఆయా మండలాల్లో పోలింగ్ రోజు స్థానిక సెలవులు ఇవ్వనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. డిసెంబర్ 11, 14, 17న పంచాయతీ ఎన్నికలు జరుగుతుండగా, ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఆయా మండలాల్లో స్థానికంగా సెలవులు ప్రకటించినట్లు కలెక్టర్ తెలిపారు.


