News April 4, 2024
తాడిపత్రి: పింఛన్ కోసం వెళ్లి ఇద్దరు వృద్ధులు మృతి

పింఛన్ కోసం వెళ్లి ఇద్దరు వృద్ధులు మృతి చెందిన ఘటన తాడిపత్రి మండలంలో చోటు చేసుకుంది. పట్టణ పరిధిలోని టైలర్స్ కాలనీకి చెందిన హుసేన్ మియా పింఛన్ కోసం సచివాలయం వద్దకు వెళ్లి వడదెబ్బకు గురై మృతి చెందారు. అలాగే చిన్నపొలమడ గ్రామానికి చెందిన ఆదెమ్మ నిన్న పింఛన్ కోసం వెళ్లి అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందింది.
Similar News
News December 4, 2025
రోడ్డు భద్రతా చర్యలు చేపట్టడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: కలెక్టర్

రోడ్డు భద్రతా చర్యలు చేపట్టడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. గురువారం అనంతపురం జిల్లా కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా రోడ్డు భద్రతా సమావేశాన్ని ఎస్పీతో కలిసి నిర్వహించారు. కలెక్టర్, ఎస్పీ మాట్లాడుతూ.. రోడ్డు భద్రతపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
News December 4, 2025
అనంతపురం జేఎన్టీయూలో శిక్షణా తరగతులు

అనంతపురం జేఎన్టీయూలో RTIH ఆధ్వర్యంలో స్పార్క్ 3 రోజుల శిక్షణ కార్యక్రమం బుధవారం ప్రారంభించారు. జేఎన్టీయూ వైస్ ఛాన్స్లర్ డాక్టర్ హెచ్.సుదర్శన్ రావు, జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహర్ హాజరయ్యారు. వారు మాట్లాడుతూ.. స్పార్క్ కార్యక్రమాల ద్వారా ప్రాంతీయ యువతలో సృజనాత్మక ఆలోచనల పట్ల ఆసక్తి పెరుగుతుందన్నారు. స్టార్టప్ రంగంలో వీరికి మార్గదర్శక అందించడంలో ఈ వేదిక కీలక భూమిక పోషిస్తుందన్నారు.
News December 4, 2025
అనంతపురం జేఎన్టీయూలో శిక్షణా తరగతులు

అనంతపురం జేఎన్టీయూలో RTIH ఆధ్వర్యంలో స్పార్క్ 3 రోజుల శిక్షణ కార్యక్రమం బుధవారం ప్రారంభించారు. జేఎన్టీయూ వైస్ ఛాన్స్లర్ డాక్టర్ హెచ్.సుదర్శన్ రావు, జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహర్ హాజరయ్యారు. వారు మాట్లాడుతూ.. స్పార్క్ కార్యక్రమాల ద్వారా ప్రాంతీయ యువతలో సృజనాత్మక ఆలోచనల పట్ల ఆసక్తి పెరుగుతుందన్నారు. స్టార్టప్ రంగంలో వీరికి మార్గదర్శక అందించడంలో ఈ వేదిక కీలక భూమిక పోషిస్తుందన్నారు.


