News March 16, 2025

తాడూర్: విద్యార్థులు సద్వినియోగం చేసుకోండి

image

నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు తెలకపల్లి తెలంగాణ మహాత్మ జ్యోతిరావు ఫులే గురుకుల పాఠశాలలో 6, 7, 8, 9 తొమ్మిదవ తరగతిలో 2025-26 సంవత్సరానికి మిగిలిన సీట్లు భర్తీ చేసేందుకు తాడూర్ గురుకుల ప్రిన్సిపల్ రష్మీ నోటిఫికేషన్ విడుదల చేశారు. దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 31వ తారీఖు చివరి తేదీ అని తెలిపారు. ఏప్రిల్ 20వ తేదీన పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. 6వ తరగతి ప్రవేశానికి 12 ఏళ్ల వయసు ఉండాలని తెలిపారు.

Similar News

News November 21, 2025

గోవింద కోటితో శ్రీవారి VIP బ్రేక్ దర్శనం

image

యువతలో ఆధ్యాత్మిక చైతన్యం, సనాతన ధర్మంపై అనురక్తి కల్పించడమే లక్ష్యంగా TTD కీలక నిర్ణయం తీసుకుంది. రామకోటి తరహాలో గోవింద కోటిని ప్రవేశపెట్టింది. గోవింద కోటి రాసిన యువతకు VIP దర్శనాన్ని కల్పిస్తోంది. 25 ఏళ్లు అంతకంటే తక్కువ వయసున్న వారు ఇందుకు అర్హులు. 1,00,01,116 సార్లు రాసిన వారికి కుటుంబ సమేతంగా వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించనున్నారు.

News November 21, 2025

NLG: కొత్త రూల్స్ అమలు.. దరఖాస్తులు షురూ

image

కంకర మిల్లులకు ప్రభుత్వం తాజాగా కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఓవర్ లోడ్‌తో వెళ్లే వాహనాల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున సమూల మార్పులకు ప్రభుత్వం కసరత్తు చేసింది. అందులో భాగంగానే క్రషర్ మిల్లులకు, ఖనిజాన్ని సరఫరా చేసే వాహనాల విషయంలో కొత్త రూల్స్ అమలు చేసింది. దీంతో జిల్లాలో 20 క్రషర్ మిల్లుల యజమానులు, 150 టిప్పర్ల యజమానులు కూడా తిరిగి రిజిస్ట్రేషన్ కోసం మైనింగ్ ఆఫీసులో దరఖాస్తు చేసుకున్నారు.

News November 21, 2025

ADB: లోకల్ వార్.. అయోమయంలో బీసీలు

image

స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం మళ్లీ కసరత్తు ప్రారంభించింది. గతంలో ఇచ్చిన రిజర్వేషన్లపై ప్రతిష్ఠ కొనసాగుతుండటంతో పార్టీ పరంగా 42% బీసీలకు టికెట్లు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. అయితే ఈ నిర్ణయాన్ని అన్ని పార్టీలు ఆమోదించాయా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. కాగా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 1514 GPలు, 581 ZPTC, 69 MPTC స్థానాలు ఉండగా.. బరిలో నిలవాలనుకున్న బీసీలు అయోమయంలో ఉన్నారు.