News June 25, 2024
తాడేపల్లిగూడెం: గల్లంతైన బాలుడి మృతదేహం లభ్యం

తాడేపల్లిగూడెంలో ఆదివారం గల్లంతయిన బాలుడి మృతదేహాన్ని మంగళవారం పోలీసులు గుర్తించారు. మణికంఠ అనే బాలుడు సెలూన్ షాపుకు వెళ్లి యాగర్లపల్లి ఏలూరు కాలువలో దిగి గల్లంతైన విషయం తెలిసిందే. గల్లంతైన బాలుడి కోసం ఎన్.డి.ఆర్.ఎఫ్, పోలీసు, ఫైర్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. మంగళవారం తాడేపల్లిగూడెంలోని ఆంజనేయ స్వామి గుడి సమీపంలో మణికంఠ మృతదేహం గుర్తించారు.
Similar News
News February 22, 2026
మెంటేవారితోట: 1,000 పెన్నులతో బాల త్రిపుర సుందరికి అలంకరణ

ఇంటర్ మీడియట్ పరీక్షల్లో భాగంగా భీమవరం మెంటేవారితోటలోని శ్రీబాలత్రిపుర సుందరిదేవి అమ్మవారికి 1,000 పెన్నులతో ఆదివారం ప్రత్యేక అలంకరణ చేశారు. ఆలయ అభివృద్ధి కమిటీ అధ్వర్యంలో దాతల సహకారంతో ఆలయ అర్చకుడు శ్రీనివాస్ అమ్మవారికి కుంకుమ పూజలు, అభిషేకాలు చేశారు. అనంతరం 1,000 పెన్నులతో అమ్మవారిని అలంకరించారు. ఈ పెన్నులను విద్యార్థులకు అందజేస్తామని ఆలయ కమిటీ తెలిపింది.
News February 22, 2026
భీమవరం: రేపు 10గం.ల నుంచి 1 గంట వరకే ఈ కార్యక్రమం

భీమవరం కలెక్టరేట్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ మండల కార్యాలయాల్లో సోమవారం PGRSను యథావిధిగా నిర్వహిస్తామని కలెక్టర్ నాగరాణి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించేందుకు అధికారులు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. నేరుగా రాలేని వారు 1100 కాల్ సెంటర్, వెబ్సైట్ ద్వారా తమ ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చన్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.30ని.ల వరకు అర్జీలను స్వీకరిస్తామన్నారు.
News February 22, 2026
ప.గో: EX MLA పేరుతో INSTA అకౌంట్.. నమ్మితే అంతే..!

నరసాపురం మాజీ MLA కొత్తపల్లి జానకీ రామ్ పేరుతో గుర్తుతెలియని వ్యక్తులు ఇన్స్టాగ్రామ్లో నకిలీ ఖాతాలు సృష్టించి మోసాలకు పాల్పడుతున్నారు. ఈ ఖాతాల ద్వారా అభిమానులకు మెసేజ్లు పంపుతూ డబ్బులు అడుగుతున్నట్లు ఆదివారం వెలుగులోకి వచ్చింది. సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు, అనుచరులు అప్రమత్తంగా ఉండాలని, ఎవరికీ డబ్బులు పంపి మోసపోవద్దని జానకీ రామ్ కోరారు.


