News March 9, 2025

తాడేపల్లిలో అంబాజీపేట యువకుడిపై దాడి

image

అంబాజీపేట మండలం వక్కలంకకి చెందిన వాసంశెట్టి సంతోష్‌‌కి విజయవాడకు చెందిన హరికృష్ణకు తాడేపల్లి(M) వడ్డేశ్వరంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో ఘర్షణ జరిగింది. దీంతో అతడిని చంపాలని గ్యాంగ్‌తో కలిసి హత్యాయత్నం చేసేందుకు యత్నించారు. అతడు ఒంటరిగా కారులో వెళుతున్న సమయంలో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన సంతోష్‌ని విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. సంతోష్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు CI తెలిపారు.

Similar News

News January 18, 2026

మళ్లీ పడిపోయిన ఉష్ణోగ్రతలు

image

AP: ఇటీవల రాష్ట్రంలో చలి తీవ్రత కాస్త తగ్గిన విషయం తెలిసిందే. అయితే మళ్లీ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. నిన్న అరకులోయలో 3.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏలూరు, తూ.గో., ప.గో., అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అతి తక్కువ విజిబిలిటీ నమోదైంది. అన్ని జిల్లాల్లో మంచు దుప్పటి కప్పేసింది. ఇవాళ కూడా దట్టమైన పొగమంచు ఉంటుందని, ఉ.8 గంటల వరకు బయటకు రావొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది.

News January 18, 2026

అనంత జిల్లా అల్లుడికి 116 రకాల పిండి వంటలు

image

అనంతపురం జిల్లాకు చెందిన గౌతమ్‌ గతేడాది గోదావరి జిల్లాకు చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈ సంక్రాంతి పండుగకు అత్త గారింటికి వెళ్లారు. సంక్రాంతి పండుగ సందర్భంగా వారు గోదారోళ్ల మర్యాదలు చూపించారు. 116 రకాల పిండి వంటలతో భోజనం వడ్డించారు. కొత్త అల్లుళ్లకు రకరకాల పిండి వంటలతో మర్యాదలు చేయడం ఈ మధ్య గోదావరి జిల్లాలో ఫేమస్ అయిన సంగతి తెలిసిందే.

News January 18, 2026

ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలతో కేటీఆర్ సమావేశం

image

కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒకప్పుడు వెనుకబడిన జిల్లాను BRSపాలనలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని పట్టణ ప్రజలకు వివరించాలని సూచించారు.రానున్న మున్సిపల్ ఎన్నికల్లో సమిష్టిగా ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు.