News April 12, 2025

తాడేపల్లి: ఇంటర్ బాలికల అదృశ్యం.. గుర్తించిన పోలీసులు

image

ఇంటర్ ఎగ్జామ్స్‌లో ఫెయిల్ అవుతామనే భయంతో ఇద్దరు బాలికలు ఇళ్లను వదిలి వెళ్లిన ఘటన తాడేపల్లిలో చోటుచేసుకుంది. విజయవాడలోని ఓ ప్రయివేటు కాలేజీలో ఇంటర్ చదువుతున్న బాలికలు గత రాత్రినుంచి కనపడటం లేదని తాడేపల్లి పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. సీఐ కళ్యాణ్ రాజు టెక్నాలజీ సహాయంతో హైదరాబాదులో వారిని గుర్తించి తాడేపల్లి తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు.

Similar News

News February 11, 2026

GNT: సేల్స్ ఎగ్జిక్యూటివ్ చేతివాటం..!

image

గోల్డ్ షాప్‌లో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న వ్యక్తి డైమండ్ నెక్లెస్ లింకులు విడతల వారీగా చోరీ చేసిన ఘటన‌పై అరండల్ పేట పోలీసులు కేసు నమోదు చేశారు. అమరావతి రోడ్డులోని ఓ షోరూమ్‌లో సేల్స్ ఎగ్జిక్యూటివ్ రూ.2లక్షల విలువ చేసే 12 గ్రాముల డైమండ్ నెక్లెస్ లింకులు మూడుసార్లు చోరీ చేశాడు. బ్రాంచ్ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు.

News February 11, 2026

జనగామ: 18 రకాల గుర్తింపు కార్డులతో ఓటు వేయొచ్చు!

image

పోలింగ్ కేంద్రాల్లోకి ఓటు వేసేందుకు వెళ్లే అభ్యర్థులు, ఓటర్లు 18 రకాల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన గుర్తింపు కార్డులను వెంట తీసుకెళ్లి ఓటు వేయవచ్చని జిల్లా ఎన్నికల అధికారులు తెలిపారు. ఆధార్, పాన్ కార్డు, పాస్ పోర్ట్, బ్యాంకు పాస్ పుస్తకం, ఓటరు ఐడీ, జాబ్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, లేబర్ కార్డు, రేషన్ కార్డు, రైతు గుర్తింపు కార్డులతో ఓటు వేయవచ్చని చెప్పారు.

News February 11, 2026

ఓటు హక్కును వినియోగించుకోవాలి: కలెక్టర్

image

ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ మున్సిపాలిటీల ఓటర్లు తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ హరిత కోరారు. బుధవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని, 100 శాతం పోలింగ్ నమోదుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సెలవును వృథా చేయకుండా రాజ్యాంగం కల్పించిన హక్కును చాటుకోవాలన్నారు. ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ఓటర్లు నిర్భయంగా తరలిరావాలని ఆమె సూచించారు.