News May 12, 2024

తాడేపల్లి: మోదీ నామినేషన్‌కి చంద్రబాబుకి ఆహ్వానం

image

ప్రధాని మోదీ మే 14న ఉత్తరప్రదేశ్లోని వారణాసి లోక్ సభ స్థానానికి నామినేషన్ సమర్పించనున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి ఎన్డీఏ కూటమిలోని ప్రధాన పార్టీల నేతలను మోదీ ఆహ్వానించారు. ఇందులో భాగంగా తన నామినేషన్ కార్యక్రమానికి రావాలని టీడీపీ అధినేత చంద్రబాబుకి మోదీ ఆహ్వానం అందింది. మంగళవారం ప్రత్యేక విమానంలో వారణాసి వెళ్తారు. ఈ కార్యక్రమం అనంతరం ఎన్డీఏ పక్షాలతో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడతారు.

Similar News

News February 14, 2025

టెక్నికల్ సర్టిఫికెట్ కోర్స్ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోండి: DEO

image

ఈ నెల 19 నుంచి 22వ వరకు టెక్నికల్ సర్టిఫికెట్ కోర్స్ (డ్రాయింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ లోయర్, హైయ్యర్ గ్రేడ్) పరీక్షలు నిర్వహిస్తున్నట్లు గుంటూరు డీఈవో సి.వి రేణుక ఒక ప్రకటనలో తెలిపారు.www.bseap.org వెబ్‌సైట్‌లో హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు. గుంటూరు నగరంలోని స్టాల్ స్కూల్, చలమయ్య సాధు సుబ్రహ్మణ్యం పాఠశాలల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు.

News February 13, 2025

వైసీపీటీఏ డైరీ ఆవిష్కరించిన వైఎస్ జగన్

image

తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ఏపీ వైఎస్సార్టీఏ అధ్యక్షులు అశోక్ బాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం సుధీర్, గౌరవ అధ్యక్షులు జాలిరెడ్డితో పాటుగా 26 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వైసీపీటీఏ డైరీని జగన్ ఆవిష్కరించారు. అనంతరం ఉపాధ్యాయుల సమస్యల గురించి జగన్ అడిగి తెలుసుకున్నారు.

News February 13, 2025

ప్రతిభ కనబరిచిన గుంటూరు పోలీసులు

image

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలలో ప్రతిభ కనబరిచిన గుంటూరు పోలీసులను గురువారం జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్ అభినందించారు. అనంతపురంలోని పోలీసు ట్రైనింగ్ కాలేజీలో నిర్వహించిన పోటీలలో గుంటూరుకు చెందిన ఏడుగురు పోలీసులు మొత్తం 21 పతకాలు సాధించారు వాటిలో 8 బంగారు పతకాలు ఉన్నాయి. ఆయా పోలీసులకు గురువారం ఎస్పీ సతీశ్ కుమార్ చేతుల మీదగా పతకాలు, ప్రశంసా పత్రాలు అందించి అభినందించారు.

error: Content is protected !!