News April 12, 2025
తాడ్బండ్ టెంపుల్లో హీరోయిన్ ప్రీతి జింటా

ప్రముఖ సినీనటి, IPL పంజాబ్ కింగ్స్ జట్టు యజమాని ప్రీతి జింటా తాడ్బండ్ను సందర్శించారు. హనుమాన్ జయంతి సందర్భంగా వీరాంజనేయ స్వామి ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్తో పంజాబ్ కింగ్స్ తలపడనున్న నేపథ్యంలో ఆమె ఆలయానికి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. భద్రతా కారణాల దృష్ట్యా ఆమె మాస్కు ధరించినట్లు తెలుస్తోంది.
Similar News
News April 15, 2025
సికింద్రాబాద్లో 6 ప్లాట్ఫామ్స్ CLOSE.. చర్లపల్లి నుంచి సేవలు

సికింద్రాబాద్ స్టేషన్లో 100 రోజులు 6 ప్లాట్ఫామ్లు మూసివేస్తారు. రైళ్లను చర్లపల్లికి మళ్లిస్తున్నారు.
ట్రైయిన్ల వివరాలు:
APR26:సికింద్రాబాద్-దానపూర్, హైదరాబాద్-రక్సేల్
APR28:దనాపూర్-సికింద్రాబాద్, సికింద్రాబాద్-అగర్తల
APR29:రక్సేల్-సికింద్రాబాద్, ముజఫర్పూర్-సికింద్రాబాద్, సికింద్రాబాద్-సంత్రాగచి
APR30:సంత్రాగచి-సికింద్రాబాద్
MAY1:సికింద్రాబాద్-ముజర్ఫూర్
MAY2: అగర్తల-సికింద్రాబాద్
SHARE IT
News April 15, 2025
హైదరాబాద్లో భారీగా పెరిగిన చికెన్ ధరలు

HYDలో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. గత వారం KG చికెన్ రూ.200లోపు చేశారు. మంగళవారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. హోల్సేల్ దుకాణాల్లో విత్ స్కిన్ KG రూ.213, స్కిన్లెస్ KG రూ.243గా నిర్ణయించారు. రిటైల్ షాపుల్లో రూ.220 నుంచి రూ.250 మధ్యన అమ్ముతున్నారు. ఇటీవల బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్తో గిరాకీ లేక తీవ్రంగా నష్టాలు చవిచూశామని చికెన్ వ్యాపారులు తెలిపారు. ఇక డిమాండ్కు తగ్గట్లు ధరలు నిర్ణయించే అవకాశం ఉంది.
News April 15, 2025
HYD: అర్ధనగ్న నృత్యాలు.. 17 మంది యువతులు అరెస్ట్

HYDలో అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా చైతన్యపురి వైల్డ్ హార్ట్ క్లబ్లో రైడ్స్ చేశారు. సమయానికి మించి పబ్ నడపడం, యువతులతో అర్ధనగ్న నృత్యాలు చేయిస్తున్నట్లు గుర్తించారు. కస్టమర్లని ఆకట్టుకునేలా యువతులతో ఇలా చేయించడం గమనార్హం. ముంబై నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి మరీ కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. మొత్తం 17మంది యువతులు, పబ్ నిర్వాహకుడు, కస్టమర్లను పోలీసులు అరెస్ట్ చేశారు.