News February 11, 2025
తాడ్వాయిలో టిప్పర్ ఢీకొని వ్యక్తి మృతి

టిప్పర్ ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన మంగళవారం తాడ్వాయిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తాడ్వాయి గ్రామానికి చెందిన మైసయ్య(50) గ్రామపంచాయతీలో వర్కర్గా పని చేస్తున్నారు. టిప్పర్ వచ్చి ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడని స్థానికులు తెలిపారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఒక నిండు ప్రాణం పోయిందని అతని కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయారని స్థానికులు పేర్కొన్నారు.
Similar News
News November 3, 2025
వారసత్వ రాజకీయాలపై శశిథరూర్ తీవ్ర విమర్శలు

వారసత్వ రాజకీయాలు ప్రజాస్వామ్యానికి ముప్పు అని కాంగ్రెస్ MP శశిథరూర్ విమర్శించారు. భారత రాజకీయాలు కుటుంబ వ్యాపారాలుగా మారాయన్నారు. ‘దశాబ్దాలుగా ఒకే ఫ్యామిలీ ఆధిపత్యం చెలాయిస్తోంది. నెహ్రూ-గాంధీ డైనస్టీ ప్రభావం స్వతంత్ర పోరాటంతో ముడిపడి ఉంది. కానీ రాజకీయ నాయకత్వం జన్మహక్కు అనే ఆలోచన పాతుకుపోయేలా చేసింది’ అని ఓ వ్యాసంలో పేర్కొన్నారు. దీంతో రాహుల్, తేజస్వీపై థరూర్ నేరుగా అటాక్ చేశారని BJP చెప్పింది.
News November 3, 2025
ప్రజా వినతులను వేగవంతంగా పరిష్కరించండి: కలెక్టర్

ప్రజల వినతులను త్వరితగతిన పరిష్కరించాలని నంద్యాల కలెక్టర్ రాజకుమారి గనియా అధికారులను ఆదేశించారు. సంబంధిత శాఖల అధికారులు ప్రజల నుంచి వచ్చిన వినతులను వేగంగా పరిష్కరించాలని తెలిపారు. ఈ క్రమంలో సోమవారం నంద్యాల పట్టణంలోని కలెక్టరేట్ కార్యాలయంలోని పీజీఆర్ఎస్ భవనంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.
News November 3, 2025
యాక్సిడెంట్ల రికార్డులు లేవన్న TGSRTC.. విమర్శలు

TG: చేవెళ్ల RTC బస్సు ప్రమాదంలో 19 మంది మరణించడం తెలిసిందే. ఇలాంటి ప్రమాదాలపై OCTలో వివరాలు అడిగిన ఓ RTI కార్యకర్తకు తమ వద్ద అలాంటి రికార్డులు లేవని RTC చెప్పింది. ప్రమాదాల్లో ఎంతో మంది చనిపోతున్నా రికార్డులు నిర్వహించకపోవడంపై విమర్శలొస్తున్నాయి. అయితే 2017-21 వరకు 2,674 ఘటనల్లో 1,230 మంది మృతి చెందారని 2022లో ఓ దరఖాస్తుకు RTC సమాధానమిచ్చింది. ఇప్పుడు రికార్డులే లేవనడం చర్చనీయాంశంగా మారింది.


