News March 10, 2025
తాడ్వాయి: ఎండాకాలంలో జాగ్రత్తలు తీసుకోవాలి: DMHO

ఎండాకాలంలో వడదెబ్బకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ములుగు డీఎంహెచ్వో గోపాలరావు మహిళలకు అవగాహన కల్పించారు. తాడ్వాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రపరిధిలోని కొండపర్తిలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్వో మాట్లాడారు. నీటిని ఎక్కువగా తాగాలని, వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్ళినప్పుడు తలకు రుమాలు, టవళ్లు చుట్టుకోవాలన్నారు. వడదెబ్బకు గురైతే దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించాలన్నారు.
Similar News
News October 22, 2025
నావూరు పెద్దవాగును పరిశీలించిన జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల

పొదలకూరు మండలం నావూరుపల్లి వద్దనున్న నావూరు పెద్దవాగును బుధవారం సాయంత్రం జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల పరిశీలించారు. తుఫాన్ నేపథ్యంలో వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటం, మూడు గ్రామాలకు రాకపోకలు బంద్ అవడంతో ఆమె వాగును పరిశీలించారు. తుఫాన్ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భారీ వర్షాలు కురుస్తుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
News October 22, 2025
కుమార్తె పై అత్యాచారయత్నం.. ఐదేళ్ల జైలు: SP

బొబ్బిలిలోని ఓ కోలనీలో 11 ఏళ్ల కుమార్తెపై అత్యాచారయత్నానికి పాల్పడిన నరసింగరావు (42)కి ఐదేళ్ల ఏళ్ల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానాను పోక్సో కోర్టు విధించిందని ఎస్పీ దామోదర్ తెలిపారు. బాధితురాలికి రూ.50 వేల పరిహారం మంజూరు చేసిందన్నారు. జూలైలో నమోదైన కేసును సమర్థవంతంగా దర్యాప్తు చేసిన సీఐ సతీష్ కుమార్, పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
News October 22, 2025
జనగామలో వెలిగిన ఆకాశ జ్యోతి..!

కార్తీకమాసాన్ని పురస్కరించుకొని జనగామ జిల్లా కేంద్రంలోని గుండ్లగడ్డ శ్రీఉమామహేశ్వర దేవాలయంలో కార్తీకమాసం మొదటి రోజు సందర్భంగా బుధవారం రాత్రి ఆకాశ జ్యోతిని వెలిగించారు. ఆలయ పూజారి సాంబమూర్తి కార్తీక మాస పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు అనురాధ, రాణి, హైమ, రమ, ఉమా, మౌనిక, విజయ, ప్రభాకర్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.